2024 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరఫున మాడుగుల అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తిని ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది. పెందుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెందుర్తి సీటు కావాలని పట్టుబడటంతో చంద్రబాబు నాయుడు ఆ సీట్ ని అప్పటికే కూటమి లో భాగంగా జనసేనకి కేటాయించడంతో సత్యనారాయణ మూర్తికి ఆ సీట్ కేటాయించలేక పోయాడు. సీట్ దక్కని సత్యనారాయణ మూర్తి కూటమి అభ్యర్థి అయిన పంచకర్ల రమేష్ బాబుకి ఏ మాత్రం సహకరించకుండా ఇంటికి పరిమితమయ్యాడు.
పంచకర్ల రమేష్ బాబుకి సహకరించమని చంద్రబాబు నాయుడు పలుసార్లు కోరినా చంద్రబాబునాయుడు మాటని పెడచెవిన పెట్టాడు బండారు . ఇటీవల అనకాపల్లి ప్రజ గళం సభకు చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా సత్యనారాయణమూర్తిని బుజ్జగించాలని ప్రయత్నించడం సత్యనారాయణ మూర్తి చంద్రబాబు మాట వినకపోవడంతో బస్సులోనే చంద్రబాబు సత్యనారాయణమూర్తి పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దీంతో కోపోద్రికుడైన సత్యనారాయణమూర్తి చంద్రబాబుకి దండం పెట్టి బస్సు దిగి వెళ్లిపోయాడు.
ఈ సంఘటన జరిగిన రెండు రోజుల్లోనే మాడుగుల సీటు బండారు సత్యనారాయణ మూర్తికి కేటాయించడం తెలుగుదేశం శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కూటమి తరుపున మొదట ఆ సీట్ ని ఎన్నారై పైలా ప్రసాద్ కేటాయించడంతో పైలా ప్రసాద్ నియోజవర్గ వ్యాప్తంగా తన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికే సుడిగాలి పర్యటన చేశాడు. రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం ఏర్పడితే పైలా ప్రసాద్ కి మొదట ప్రియారిటి ఇస్తామని చెప్పి ఆ సీట్ ను బండారు సత్యనారాయణమూర్తి కేటాయించారు. రానున్న ఎన్నికల్లో బండారు ఏమాత్రం ప్రభావం చూపుతాడో చూడాలి.