2024 సార్వత్రిక ఎన్నికల ముందు అమలుగాని హామీలు ఇస్తున్న చంద్రబాబు అవి నెరవేర్చేందుకు వీలుండదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో తెలిపారు. అమలు గాని హామీలు ఇవ్వడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు సంపద సృష్టిస్తా అని తరచూ చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఆయన సృష్టించింది శూన్యం అని మీడియాతో వెల్లడించారు. ఆయన సృష్టించిన సంపద ఏమాత్రమో గత 30 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రం రెవెన్యూ డెఫిసెట్ లోనే ఉందని ,మరి ఆయన సృష్టించిన సంపద ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
చంద్రబాబు నైజం ఎప్పటికీ మారదని దానికి ఉదాహరణగా మన ముందు జరిగిన 2014 ఎన్నికలో ఇచ్చిన హామీలే అని చెప్పవచ్చని ఎన్నికల ముందు వందల హామీలను ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని, వాటిని అమలు చేయకపోవడం కూడా చంద్రబాబుకి పరిపాటిగా మారిందని తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే తలలో చిప్ పోయినట్టు ఉందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చరిత్ర ఆయనకు ఉందన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఆచరణ సాధ్యమయ్యే హామీను మాత్రమే వైసీపీ ఇచ్చిందని, రాత్రికి రాత్రి సంపద ఎక్కడ నుంచి వస్తుందని చంద్రబాబును నిలదీశారు. పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినా వాటికి మౌళిక సదుపాయాలు కల్పించడం, ఉత్పత్తి ప్రారంభించడం ఆ తరువాత వాటికి మార్కెట్ చేస్తే సంపద వస్తుందని తెలిపారు. ఇవన్నీ ఉన్నపళంగా ఎక్కడి నుంచి తీసుకొస్తారని వీటికి కూడా కొంత సమయం పడుతుందని ప్రజలు లాజికల్గా ఆలోచించాలని చెప్పారు. ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు మాయలో పడకండి అని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.