చంద్రబాబు నాయుడికి చిన్నప్పుడు బడిలో ఆవు వ్యాసాలు బాగా రాసిన అలవాటు ఉందేమో.. ప్రతి ఎన్నికల సభలో చాలా వరకూ ఒకటే పాఠం అప్పజెపుతారు. అందుకే వాటికి వెళ్లేందుకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే భయపడుతుంటారు. నెల్లూరు జిల్లాలో కావలి, ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుల్లో ప్రజాగళం సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక వచ్చిన కొద్దిపాటి మంది బాబు స్పీచ్ విని అందరూ నీరసించిపోయారు. దాని నిండా అబద్ధాలే ఉన్నాయి. తాను చేయని పనులను ఖాతాలో వేసుకున్నాడు. వివేకానందరెడ్డి హత్య, సునీత, షర్మిల, ఉద్యోగులు, మహిళలు, కాంట్రాక్టర్లు, మద్యం తదితర విషయాల్లో మొదటి నుంచి చెబుతున్న కట్టుకథలనే ఇక్కడ చెప్పాడు.
నా పేరు చెబితే కియా, ఉద్యోగాలు గుర్తొస్తాయని నారా వారు అన్నారు. అసలు కియా క్రిడెట్ ఆయనది కాదని అందరికీ తెలుసు. కానీ ఎల్లో మీడియా దానిని టీడీపీ అధినేత ఖాతాలో వేసేసింది. జగన్ ఐదేళ్లలో యువతకు 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. కాకపోతే ఈ విషయాన్ని పచ్చ గ్యాంగ్ ఒప్పుకోదు. సభలో ఎంతసేపటికీ జాబ్స్ ఇవ్వలేదని బాబు అన్నాడు. కానీ ఆయన హయాంలో ఇచ్చింది కేవలం 34 వేలు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి.
ఇక్కడికి వచ్చి చూస్తే ఉదయగిరి రైతాంగం వ్యధ ఎలా ఉంటుందో తెలుస్తోంది. జగన్ వచ్చాక ఒక్క సాగునీటి పథకం పూర్తైందా? విత్తనాలు ఇచ్చారా? అన్నారు. ఈ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగడే వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి ఇవ్వని చరిత్ర బాబుది. 2014లో అధికారంలోకి వచ్చినా కమీషన్ల పేరుతో దండుకున్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత జగన్ది. అలాగే హైలెవల్ కెనాల్ పనులు చేయిస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. టీడీపీ హయాంలో విత్తనాల కోసం అన్నదాతల క్యూలు కనిపించేవి. నేడు ప్రతి గ్రామంలో ఆర్బీకేల ద్వారా సులువుగా అందుకుంటున్నారు. ఒకప్పుడు ఉదయగిరి నుంచి వలసలుండేవి. నేడు చాలా వరకు తగ్గిపోయి వ్యవసాయం చేసుకుంటున్నారు.
బాదుడుకు గురైన ఆడబిడ్డల్లో తిరుగుబాటు కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిజం ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం ఏపీలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రూ.2.70 లక్షల కోట్లను వారి బ్యాంకు అకౌంట్లలో వేశారు. 30 లక్షల మందికి పైగా స్థలం ఇచ్చి సొంతింటి కలను సాకారం చేస్తున్నారు. బాబులా ఎన్నికల సమయంలో పసుపు – కుంకుమంటూ మోసం చేయలేదు. ఇష్టానుసారంగా అవినీతి చేశారన్నారు. 2014 – 19 మధ్య ఉదయగిరి నియోజకవర్గంలో చిన్నపాటి చెక్డ్యాంలు, సాగునీటి పనుల పేరుతో వందల కోట్ల రూపాయలను తెలుగు తమ్ముళ్లు తినేశారు. ఇక దగదర్తి విమానాశ్రయం పేరుతో చేసిన భూ అక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆనాడు అవినీతి బయటకు రాకుండా ఆపిన చరిత్ర టీడీపీ అధిష్టానానిది.
రాష్ట్రం నాశనమైపోయింది. బాగు చేయడానికి మూడు పార్టీలం కలిశామన్నారు. జగన్పై అంతలా ప్రజా వ్యతిరేకత ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవచ్చు కదా. కానీ బాబుకు తనపై తనకు నమ్మకం లేదు. అధికారంలోకి రాగానే సూపర్ 6 అమలు చేస్తామన్నారు. అదే జగన్ పక్కాగా సంక్షేమ పథకాలు అందిస్తే ఏపీ శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. కానీ రామాయపట్నం పోర్టుకు 19 ఎన్నికల సమయంలో తూతూమంత్రంగా శంకుస్థాపన చేసింది నారా వారే. జగన్ దానికి నిధులు విడుదల చేసి పూర్తి చేయిస్తున్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయించి, యువతకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఇద్దరి మధ్య తేడా అది. బాబు పేరు చెబితే జన్మభూమి కమిటీలు, అమరావతి భూ కుంభకోణం, పెత్తందారులకు దోచి పెట్టడం తదితరాలు గుర్తొస్తాయి. అదే జగన్ పేరు చెబితే పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు మనసులో మెదిలాడతాయి.