దేశ చరిత్రలో పేదలని ఉద్దరిస్తాం, పేదలకోసమే పనిచేస్తాం అని చెప్పుకునే రాజకీయ నాయకులని చూసాం కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పేదలు బాగుపడుతుంటే ఓర్చుకోలేని రాజకీయ నాయకుడిని చూస్తన్నం, ఆయన మరెవరో కాదు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన గారి పోకడ చూస్తుంటే తాను 14ఏళ్ళు ముఖ్యమంత్రి సీట్లో కూర్చిని కనీసం పేదలకి తన మార్క్ గా చేసిన మంచి పని ఇది అని చెప్పుకోలేని స్థితిలో ఉన్న చంద్రబాబు. తానే కాదు పేదలకి ఎవరు చేసినా నేను భరించలేను అనే స్థాయికి వెళ్ళిపోయాడా అనే అనుమానం కలగక మానదు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా అనేక సంక్షేమ పదకాలు ప్రవేశ పెట్టారు , డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎక్కడా వివక్ష చూపకుండా గతంలో ఏ నాయకుడు చేయలేని విధంగా లంచాలు లేకుండా నేరుగా లబ్దిదారుని ఖాతాల్లోకే జమ చేసి తన మార్క్ సంక్షేమ పాలన 57 నెలలుగా అందిస్తూ వస్తున్నారు. మధ్యలో కరోనా లాంటి మహమ్మారి వచ్చినా వారికి ఇచ్చే సంక్షేమంలో వెనకడుగు వేయలేదు. అయితే పేదలకు ఈ స్థాయిలో మేలు చేస్తున్న జగన్ గారి తీరు చంద్రబాబుకి నచ్చినట్టు లేదు. ఏదో రకంగా పేదవాడిని ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశంతో కేసులు ఫిర్యాదులతో వారికి మేలు జరగకుండా అడ్డు పడుతూనే ఉన్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రవేశ పెట్టిన పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య వద్దని కేసులు వేశారు, పేదలకి ఇళ్ళు ఇవ్వద్దని కేసులు వేసారు, విశాఖ పరిపాలనా రాజధాని కాకుండా కేసులు వేశారు, ఇప్పుడు తాజాగా వృద్ధులకు, వికలాంగులకు వాలంటీర్ల చేత ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వకూడదు అని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు అండ్ కో . ఈయన వ్యవహార శైలి చూస్తున్న ప్రజలు రాజకీయ క్షేత్రంలో ఉండి మరీ ఇంత బరితెగింపా అని ముక్కున వేలేసుకుంటున్నారు. టిప్పర్ డ్రైవర్ కి సీటు ఇస్తే ఓర్చుకోలేరు, పేద వాళ్ళకి సంక్షేమం ఇస్తే ఓర్చుకోలేని చంద్రబాబుకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హతే లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.