ప్రధానులు, రాష్ట్రపతులుగా ఎవరుండాలో డిసైడ్ చేశానని ఇప్పటికీ డబ్బా కొట్టుకునే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి టైం ఏమాత్రం బాగున్నట్లు లేదు. తన కంటే జూనియర్ నేతల అపాయింట్మెంట్ల కోసం హస్తినలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎన్డీఏలో చేరేందుకు గురువారం బాబు కేంద్ర మంత్రి అమిత్షాతో చర్చించిన విషయం తెలిసిందే. అయితే అవి కొలిక్కి రాకపోవడంతో నారా వారికి ఎదురు చూపులు తప్పలేదు. షా అపాయింట్మెంట్ కోసం శుక్రవారం ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆయన వేరే కార్యక్రమానికి వెళ్లిపోయినట్లు సమాచారం.• ఎలాగైనా సరే ఎన్డీఏలో చేరి పొత్తు ఖరారు చేసుకోవాలని బాబు, పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని ఈరోజు అర్ధరాత్రి వరకు ఎదురు చూసేందుకు సిద్ధమయ్యారు.
ఒకసారి గతంలోకి వెళ్దాం. 2019లో అయితే చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని రాష్ట్రాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి నేతల్ని కలిశారు. నరేంద్రమోదీని గద్దె దించుతా అంటూ గోల చేశారు. కానీ 24 ఎన్నికలు వచ్చేసరికి కమలం పెద్దలు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని వేచి చూస్తున్నారు. వాళ్లేమో అవసరం ఆయనది.. కాసేపు ఉండనివ్వు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ ఎన్డీఏలో చేరడం ఖాయమేనని ఎల్లో మీడియా చెబుతోంది. మరి దాగుడుమూతలాట ఏంటో..
విజయసాయిరెడ్డి ట్వీట్
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల పొత్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త వేణుంబాక విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది?• ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు.• ఈ మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది. సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్సార్సీపీకే ఓటు వేయండని కోరారు.