విద్య హక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు 25 శాతం ప్రైవేట్ స్కూల్స్ లో సీట్లు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు హయాంలో ఇది జరగలేదు. అలా సీట్లు కల్పన జరుగుతుందనుకున్న ఆశ కూడా నిరాశే, ఎందుకంటే ప్రైవేట్ విద్యాసంస్థలంతా చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచేవారే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో కల్పించాల్సిన 25 శాతం అమలు పరిచేలా ఆదేశాలు జారీ చేశారు. గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిర్విరామంగా జరుగుతుంది. 2024 -25 విద్య సంవత్సరంకి గాను అడ్మిషన్లు ప్రక్రియ రెండు నెలల ముందే మొదలుపెట్టారు. ఈ ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 25125 మంది పేద విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అలా సెలెక్ట్ అయినా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం మేసేజ్ పంపించింది. మే 10వ తేదీ లోపు విద్యార్థులు సెలెక్ట్ అయిన పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆ మెసేజ్ సారాంశం. దానికి చంద్రబాబు అనుకూల పత్రికలకు మింగుడు పడడం లేదు. గత రెండు సంవత్సరాలు ఇదే ప్రక్రియను ప్రభుత్వం కొనసాగించింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ తమ పేపర్లో రాసుకుంటూ వచ్చారు.
ఇవాళ పేరెంట్స్, టీచర్ మీటింగ్లో కూడా ఇదే తంతు జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల విద్య ప్రామాణికాలు గురించి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంలో.. పేరెంట్స్ టీచర్ మీటింగ్ కు శ్రీకారం చుట్టింది. గత నాలుగు సంవత్సరాలుగా ఇదే పద్ధతిని పాటించారు. వేసవి సెలవులు ముందు విద్యార్థి ఎక్కడ వెనకబడి ఉన్నాడో తల్లిదండ్రులకు తెలియజేస్తే, విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులో తగిన శిక్షణ తీసుకొని మెరుగుపడే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి శ్రీకారం చుట్టిన ప్రతిపక్షాల అనాలోచిత విమర్శలకు అది కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా తెలుగుదేశం, వారి అనుకూల మీడియా తరచు పేద విద్యార్థుల విషయాలలో జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సవ్యంగా జరగకుండా అడ్డు పడుతోంది.