బాబు హయాంలో అధిక ధరలకు కుదర్చుకొన్న పిపిఏలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేసే ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు చేసిన గొడవ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అలా ఎలా రద్దు చేస్తారు. ఒక ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందాలు తర్వాతి ప్రభుత్వాలు రద్దు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు అంటూ ఓవర్ యాక్షన్ చేశారు బాబు .
కానీ గతంలోకి చూస్తే నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రి వర్గ సభ్యుడిగా తాను కూడా ఉన్న కేబినెట్ చేసుకొన్న ఒప్పందాలని ఎన్టీఆర్ కీ వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి కాగానే ఎందుకు రద్దు చేసాడో సమాధానం చెప్పగలడా బాబు .
1995 లో ఎన్టీఆర్ హయాం లో కుదుర్చుకున్న 23 ఎంవోయూ లను అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది బాబు ప్రభుత్వం. ఎందుకు రద్దు చేశారని పత్రికల వారు అడగ్గా అన్నీ వర్గాల వారు అడిగారు అందుకే రద్దు చేశామని చెప్పాడు. అయితే ఆ వర్గాలు ఎవరో, ఎందుకు రద్దు చేయమన్నారో ఆ కారణాలు మాత్రం చెప్పకపోవడం ఆశ్చర్యం. అవి వివాదాస్పదం అని మాత్రం అన్నాడు కానీ ఎందుకు వివాదాస్పదం, వివాదాస్పదం అన్నది ఎవరో కూడా సమాధానం లేదు. అయితే ఆ ఎంవోయూ లు కుదుర్చుకున్నప్పుడు బాబు మంత్రివర్గంలో సభ్యుడు కూడా.. విద్యుత్ రంగం లో కుదుర్చుకున్న ఎంవోయూ ల స్థానం లో కొత్తగా మరో విధానాన్ని ప్రవేశపెట్టి విద్యుత్ బోర్డు టారిఫ్ కన్నా అధిక ధరకు అమ్మాలని నిబంధనలు పెట్టాడు..
ఎన్టీఆర్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేసి అవి వివాదాస్పదం అయినవి ప్రకటించిన బాబు లెక్క ప్రకారం ఎన్టీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది అని ఒప్పుకున్నట్లేనా? 2014-19 మధ్యలో అధిక ధరతో కుదుర్చుకున్న విద్యుత్ రంగంలో పీపీఏ లను జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారం అవుతున్న నేపథ్యం లో రద్దు చేయగా, గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదని నానాయాగి చేశాడు.. తను మాత్రం తను సభ్యుడిగా ఉన్న ఎన్టీఆర్ క్యాబినెట్ కుదుర్చుకున్న నిర్ణయాలను రద్దు చేసిన విషయం మరిచిపోయాడు…
జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లే పీపీఏ లను రద్దు చేసుకోగా, బాబు మాత్రం ఎంవోయూ లను రద్దు చేసి అధిక ధరలకే విద్యుత్ అమ్మకాలు జరపాలని ఆదేశాలిచ్చాడు . దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు బాబు ఎవరి ప్రయోజనాలకోసం పని చేస్తాడో, ఎవరి ప్రయోజనాలని వ్యతిరేకిస్తాడో…