ముంతమామిడి పండన్నాడే గంగరాజు అన్నట్లయింది చంద్రబాబు పరిస్థితి.. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటినుండి ఇప్పటివరకూ రాజ్యసభ సభ్యత్వ పోటీలో అభ్యర్థులకు అవకాశం లేకుండా ఉండటం ఇదే తొలిసారి కావడం ఆ పార్టీలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తుంది.. 1983లో ఎన్టీఆర్ ప్రభాజనంతో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ హవా 2019 లో చంద్రబాబు నాయకత్వంలో ఉనికి కోల్పోయే స్థితికి దిగజారిపోయింది.
ముంతమామిడి పండన్నాడే గంగరాజు అన్నట్లయింది చంద్రబాబు పరిస్థితి.. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటినుండి ఇప్పటివరకూ రాజ్యసభ సభ్యత్వ పోటీలో అభ్యర్థులకు అవకాశం లేకుండా ఉండటం ఇదే తొలిసారి కావడం ఆ పార్టీలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తుంది.. 1983లో ఎన్టీఆర్ ప్రభాజనంతో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ హవా 2019 లో చంద్రబాబు నాయకత్వంలో ఉనికి కోల్పోయే స్థితికి దిగజారిపోయింది.
సంఖ్యాబలం పరంగా రాజ్యసభ అభ్యర్థులను నిలబెట్టేందుకు టీడీపీకి అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెడితే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరమవుతాయి. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడం, వారిలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 18కి పడిపోయింది. ఒకవేళ అభ్యర్థిని టీడీపీ తరపున నిలబెడితే ఇంకో 26 ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. దీంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ నిలబెట్టే అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ వేయనున్నారనే అసత్య ప్రచారాన్ని తన అనుకూల మీడియాలో చంద్రబాబు చేయించడం మొదలుపెట్టాడు.
టీడీపీలో నెలకొన్న దుస్థితిని బాబు ఒప్పుకుని పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిని పోటీకి నిలబెట్టడం లేదని ప్రజలకు చెబితే పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదేమో కానీ తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ నాయకులతో అవాస్తవాలను ప్రచారం చేయించి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ నుండి దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారంటూ అధికార పార్టీలో అసంతృప్తులు ఉన్నారని వారంతా టీడీపీ వైపు చూస్తున్నారంటూ కల్లబొల్లి కబుర్లను తన అనుకూల మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అసంతృప్త ఎమ్మెల్యేలు, ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినట్లు రాజ్యసభ ఎన్నికల్లో కూడా క్రాస్ ఓటింగ్ చేస్తారని ప్రజల మెదళ్ళలోకి ఎక్కించే ప్రయత్నం బాబు చేసాడు.
కానీ వాస్తవానికి రాజ్యసభ ఎన్నికలు ఓపెన్ బ్యాలెట్ పద్దతిలో జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఓటు వేసే ముందు పార్టీ ఏజెంట్ కు తాము వేసే ఓటును చూపించి ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ విప్ ను ధిక్కరించినా, ఏజెంట్ కి ఒకరికి ఓటు వేస్తున్నట్లు చూపించి మరొకరికి ఓటు వేసిన ఆ ఓటు డిస్ క్వాలిఫై అవుతుంది.. ఈ ప్రక్రియలో ప్రత్యర్థి పార్టీలకి ఓట్లు వేయడం దాదాపు అసాధ్యం కానీ తన అనుకూల మీడియాలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేయించడం అతని కుటిల రాజకీయానికి పరాకాష్టగా చెప్పొచ్చు.
ఇప్పటికే తెలంగాణలో ఓటుకు నోటు కేసు వల్ల ఇబ్బంది పడ్డ చంద్రబాబు మరోసారి నోట్లను వెదజల్లి ఎమ్మెల్యేలను కొనే సాహసం చేయడానికి ముందుకు రావడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.. దీంతో పార్టీ స్థాపించిన ఇన్నేళ్ల తరువాత రాజ్యసభలో టీడీపీకి సభ్యత్వం లేని పరిస్థితి నెలకొంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ అని అంతా నేనే అన్నీ నేనే అని చెప్పుకునే చంద్రబాబుకి ఈ దుస్థితి కలగడం నిజంగా బాధాకరమైన విషయమే కానీ ఆయన కాలం చెల్లిన విధానాలు పద్ధతులు వల్లనే టీడీపీకి ఈ పరిస్థితి దాపురించిందని టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు అన్నట్లుగా చివరికి రాజ్యసభలో టీడీపీకి అభ్యర్థి లేకుండా పోయాడు..