41 ఏళ్ల టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతటి ఘోర అవమానం గతంలో ఎప్పుడూ జరగలేదు. రాజ్యసభలో టీడీపీ జెండా గల్లంతవడం టీడీపీ ఏర్పడిన అనంతరం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చంద్రబాబు అవలంబించిన విధానాలు పార్టీని నడిపించిన తీరు వల్లనే ఈ స్థితి దాపురించిందని టీడీపీ శ్రేణులు లోలోపల కుమిలిపోతున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిని నిలిపే సాహసం కూడా టీడీపీ చేయలేకపోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనంగా చెప్పొచ్చు. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని మూడు […]
ముంతమామిడి పండన్నాడే గంగరాజు అన్నట్లయింది చంద్రబాబు పరిస్థితి.. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటినుండి ఇప్పటివరకూ రాజ్యసభ సభ్యత్వ పోటీలో అభ్యర్థులకు అవకాశం లేకుండా ఉండటం ఇదే తొలిసారి కావడం ఆ పార్టీలోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తుంది.. 1983లో ఎన్టీఆర్ ప్రభాజనంతో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ హవా 2019 లో చంద్రబాబు నాయకత్వంలో ఉనికి కోల్పోయే స్థితికి దిగజారిపోయింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది మా వైపు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిని పోటీలో పెట్టి గెలుస్తామని ప్రగల్బాలు పలికిన తెలుగుదేశం చివరికి తోక ముడిచింది.
రాజ్యసభ అభ్యర్థులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డిలకు సీఎం జగన్ బీ ఫామ్ అందజేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేసేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ లో జగన్ చేతులు మీదుగా బీ ఫామ్ అందుకున్న వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈనెల 15వ తేదీ వరకు నామినేషన్ లు వేసేందుకు గడువు ఉండగా […]