పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు కీలక దశకు చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన రఘురామ కృష్ణరాజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి మరో పార్టీలో చేరకుండా, రాజీనామా చేయకుండా వైఎస్ఆర్సీపీ లోనే కొనసాగుతూనే పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేక రాగం అందుకొని టీడీపీ, బీజేపీలతో జత కట్టాడు. ప్రతి రోజు టీవీ డిబేట్ లలో పాల్గొంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మన్ననలు పొందాడు. ఇలా నాలుగు సంవత్సరాలు కాలం సాగదీసిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు కూడా రానే వచ్చాయి.
గతంలో పలు డిబేట్లు, మీడియా సమావేశాలలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి నా గెలుపుకు కారణం కాదు, నా చరిష్మాతో గెలిచాను అని చెప్పుకుంటూ వచ్చిన రఘురామ కృష్ణం రాజు టిడిపి జనసేన పొత్తు ప్రకటన తర్వాత జెండా సభలో కూడా కూటమి తరుపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముందు ప్రకటించాడు. బీజేపీతో పొత్తు ఖరారయినా తర్వాత నరసాపురం సీట్ బిజెపికి కేటాయించారు. బీజేపీ వారు రఘురామ కృష్ణరాజుకు కాకుండా బీజెపీ సీనియర్ నేత శ్రీనివాస్ వర్మకి సీట్ కేటాయించడంతో రఘురామ కృష్ణంరాజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్నాడు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయినప్పుడు బెయిల్ కోసం కీలకంగా వ్యవహరించిన తనకు సీట్ కేటాయించకపోవడంతో చంద్రబాబుపై మండిపడ్డాడు.
నరసాపురంలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీగా తనకు టికెట్ ఇవ్వాలని, చంద్రబాబు ఆడిన మాట తప్పి నాకు టికెట్ ఎగ్గొడితే ఎలా అని మీడియా ముఖంగా రఘురామకృష్ణంరాజు ప్రశ్నించాడు . తనకు సీటు ఇవ్వలేని వాడు రేపు పోలవరం కడతానంటే ఎలా నమ్ముతారు రాష్ట్రానికి ఏదో చేస్తానంటే ఎలా నమ్ముతారు? బీజేపీ మోసం చేస్తే నాకు టికెట్ ఇవ్వరా? అని నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ సూటిగా ప్రశ్నించారు. పొత్తులో కీలకంగా వ్యాహరించిన తనకు సీట్ లేకపోవడం ఏంటని రఘురామకృష్ణంరాజు వాపోయారు.