రైతులు అన్నా, నీటి పారుదల ప్రాజెక్టులు అన్నా కనీసం అవగాహన గానీ, శ్రద్ద గానీ ఏ మాత్రం చంద్రబాబుకు ఉండదు. 2004 కు ముందు తన తొమ్మిదేళ్ళ అధికారం లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసిన దాఖలాలు లేవు సరికదా కనీసం కేంద్రం ఆసక్తి చూపిన ప్రాజెక్ట్ లకు నివేదికలు పంపే భాద్యత కూడా తీసుకోలేదు బాబు.
దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో తను మద్దతు ఇచ్చిన వ్యక్తి ప్రధాని గా ఉన్నా తలచుకుంటే అన్ని అనుమతులు వచ్చి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగే అవకాశం ఉన్నా, కనీస శ్రద్ధ చూపకపోగా కేంద్రం నివేదిక అడిగితే కూడా పట్టిచుకోలేదు బాబు. అధికార టీడీపీ ఎమ్మెల్యే అయిన వీరభద్రరావు ఢిల్లీ వరకు మోటార్ సైకిల్ యాత్ర చేసి ప్రధాని దేవెగౌడ ని కలిసి పోలవరం కు కావాల్సిన అనుమతులు అన్నీ ఇవ్వాల్సిందిగా కోరగా, దేవెగౌడ అధికారులను పిలిచి వాకబు చేయగా, అధికారులు చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరాం అనీ, మిగులు జలాల వివాదం కానీ, ఎగువ రాష్ట్రాల నుండి ఎలాంటి ఫిర్యాదు కానీ ఎలాంటి సమస్య లేకున్న పోలవరం పై ఇంతవరకు ఎలాంటి నివేదిక బాబు ప్రభుత్వం పంపలేదని వివరించగా దేవెగౌడ విస్తుబోయాడు. అదీ కాక ఇప్పటి వరకు కేవలం మూడు లక్షల రూపాయలే బాబు మొత్తంగా పొలవరం కోసం ఖర్చు చేసింది అని వివరాలు ఇవ్వగా ఇదేమిటని ప్రధాని హోదాలో ఉన్న దేవెగౌడనే ఆశ్చర్యచకితుణ్ణి చేసిన ఘనత బాబుది.
ఇక వైయస్సార్ సీఎం అయ్యాక పోలవరం కు కావాల్సిన అన్ని అనుమతులు సంపాదించి, అన్ని కాలువలను పూర్తి చేసి డామ్ కట్టడానికి సిద్దం గా ఉంచితే 2014 లో అధికారం లోకి వచ్చిన బాబు అసలు డ్యామ్ ఎలా కట్టాలో కనీస అవగాహన లేకుండా కేంద్రం జాతీయ హోదా కల్పించి ప్రాజెక్టు మేమే కడతాం అన్నా కూడా ఎక్కడ తన అనునాయులకు కాంట్రాక్టులు దక్కవో, అందులో తనకు రావాల్సిన వాటా ఎక్కడ మిస్ అవుతుందో అని మేమే కడతాం అని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా చేసి కాఫర్ డ్యామ్ కట్టకుండానే డయాఫ్రామ్ వాల్ కట్టి ప్రాజెక్ట్ ను నాశనం చేశాడు. సాక్ష్యాత్ ప్రధాని హోదా లో ఉన్న మోదీ, బాబు పోలవరం ను ఏటీఎం లా వాడుకున్నాడు అని చెప్పాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు కు నీటి పారుదల ప్రాజెక్ట్ లా మీద ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో….