లోకేష్ తెస్తానంటున్న బీసీ రక్షణ చట్టం, చంద్రబాబు బీసీల తోకలు కత్తిరించకుండా కాపాడుతుందా?.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం యాత్రలో బీసీ సామాజిక వర్గంపై లేని ప్రేమని ఒలకపోస్తునట్టు కనిపిస్తుంది. నిత్యం అసత్యాలు పలుకుతూ తమ ప్రభుత్వంలో బీసీలపై చేసిన దౌర్జన్యాలను ప్రజలు మర్చిపోయారేమో అనే బ్రమలో ఉంటూ తిరిగి వారి ఓట్లు పొందేందుకు నానా ఫీట్లు చేస్తున్నారు. బీసీల పై జగన్ ప్రభుత్వం 26000 కేసులు పెట్టిందంటూ అంటూ ఒకసారి, 36000 కేసులు అంటూ ఒకసారి అబద్దాలు, పొంతనలేని మాటలు మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు.
బీసీలు సమాజంలో ఉన్నత స్థానానికి రాకుండా అడుగడుగునా అడ్డుపడిన టీడీపీ నేడు బీసీ రక్షణ చట్టం తెస్తానని చెబుతుంది. బీసీలను తోకలు కత్తిరిస్తా అని బహిరంగంగా హెచ్చిరించిన చంద్రబాబు బీసీల పక్షమా? బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు బీసీల పక్షమా?. బీసీల రిజర్వేషన్లు కోర్టుకు పోయి అడ్డుకున్న వ్యక్తి బీసీలకి మేలు చేసే చట్టాలు తెస్తాడా?. ఇటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేని లోకేష్ , బీసీలకి ఎంతో మేలు చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తే ఆయన రాజకీయ పరిణితి ఎంత అధమ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నమ్మిన వ్యక్తి జగన్ గారు.. కేవలం మాటలతోనే కాకుండా చేతలతో తాను బీసీలకి ఏమి మేలు చేయగలనో నిరూపించి చూపిన వ్యక్తి జగన్ గారు.బీసీలకి రాజ్యాధికారం దిశగా అడుగులు వేసిన ఏకైక నేత సీఎం జగన్ గారు, ముఖ్యమంత్రిగా జగన్ గారు భాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు ఈ దేశంలో ఎవ్వరూ కూడా ఇవ్వనటువంటి అవకాశాలు జగన్ గారు బీసీలకి ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, 137 కార్పొరేషన్లకు సంభందించి మోత్తం 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 201 అంటే 42% బీసీలకు కేటాయించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు దాదాపు 1.30 లక్షలు. వీటిలో 83% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే , గతంలో ఎన్నడూ లేని విధంగా 6.03 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది జగన్ గారి ప్రభుత్వం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సుమారు 75% ఉద్యోగాలు ఇచ్చింది జగన్ గారి ప్రభుత్వం.
ఎం.ఎస్.ఎం.ఈ లకు జగన్ గారు ఇచ్చిన ప్రోత్సాహకాలతో లబ్దిపొందుతున్న మొత్తం యూనిట్లలో 62% వాట బీసీ ఎస్సీ ఎస్టీలదే. ఇంటివద్దకే రేషన్ కార్యక్రమంలో భాగంగా ఒక్కో వాహనానికి సుమారు 6 లక్షల వ్యయంతో 9,260 రేషన్ డోర్ డెలివరి వాహనాల ఏర్పాటు చేశారు దీని వలన 18,520 మందికి ప్రత్యేక్షంగా ఉపాధి లభించింది. ఇందులో 80% లబ్దిదారులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే. 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో ఆరుగురు బీసీలు, 635 మండలాల్లో బీసీలకు 239 అద్యక్ష పదవులు, 13 కార్పొరేషన్లలో ఏడు బీసీలకు, 84 మునిసిపాలిటీల్లో 37 చైర్మన్ పదవులు బీసీలకు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ 196 పదవుల్లో 76 బీసీలకే, వివిధ 137 ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 53 బీసీలకే 25 సభ్యులున్న మంత్రివర్గంలో 11 మంది బీసీలకు స్థానం కల్పించారు. విద్య, రెవెన్యూ, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి లాంటి కీలక శాఖలు వారికే. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాల నాయుడిగారిని డిప్యుటీ సీఏం చేశారు, బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ చైర్ లో కూర్చో పెట్టారు.
శాసన మండలిలో 43 మంది వైసీపీ సభ్యులు ఉండగా అందులో అత్యధికంగా ఉన్న వారు బీసీలే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన ఘనత జగన్ గారిది, ఉమ్మడి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లు బీసీలకు ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు మొత్తంగా 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు వైఎస్ జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్లి మోకాలొడ్డింది టీడీపీ నేత బిర్రు ప్రతాప్రెడ్డి. ఇది చంద్రబాబు ఆదేశానుసారం జరిగిన పని. హైకోర్టు తీర్పుతో బీసీల రిజర్వేషన్లు 24%కి తగ్గిపోయాయి. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చి మాటను నిలబెట్టుకున్నారు.
దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 % రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం చట్టం తెచ్చారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రైవేట్ బిల్లు.. ఉభయ సభల్లోనూ పోరాటం. టీడీపీ 5ఏళ్ళ పాలనలో బీసీలకు చంద్రబాబు 19వేల కోట్లు మాత్రమే ఖర్చు చెస్తే, నాలుగేళ్ళల బీసీలకు జగన్ గారు వివిధ పధకాల ద్వార లబ్ది చేకూర్చిన మొత్తం 1,15,155.02 కోట్లు. లబ్దిపొందిన వారి సంఖ్య చూస్తే 4,04,99,004, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ.
ఇలా బీసీలకి ఏ రాజకీయ నేత చేయని మేలు జగన్ గారు చేస్తుంటే చంద్రబాబు తనయుడు లోకేష్ బీసీలకి జగన్ అన్యాయం చేశాడని తాను బీసీ రక్షణ చట్టం తెచ్చి మిమ్మల్ని కాపాడతానని చెప్పడం హాస్యాస్పదం .