ఎన్నికలు వస్తే చాలు ఎక్కడ లేని భయం బాబును ఆవహిస్తుంటుంది. ఆ భయం తో నే ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మరో ప్లాన్, ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ అంటూ వరసగా ఒకేసారి పది ప్లాన్స్ వేసుకుని రెడీ గా ఉంటాడు.
ఈసారి గతంలో లాగా బీజేపీ తో ఒకసారి, కాంగ్రెస్ తో ఒకసారి విడివిడిగా ఎన్నికలకు వెళ్తే వాళ్లు వెయ్యక, వీళ్లు వెయ్యక బొక్క బోర్లా పడ్డాం అని గ్రహించి ఈసారి బిజెపి తో ప్రత్యక్షంగా, కాంగ్రెస్ తో పరోక్షంగా ఒకేసారి జతకట్టాడు.
ముందుగా 2019 లో ఎన్నికల్లో ఓటమి పాలవ్వగానే తన రాజ్యసభ ఎంపీ లు అయిన సుజనా, సీఎం రమేష్ లను బీజేపీ లోకి పంపి, ఒక పక్క వారితో, మరో పక్క పవన్ తో బీజేపీ తో బేరసారాలు ఆడుతూ చివరికి బీజేపీ తో పొత్తుకు ఒప్పించేలా చేశాడు. మరోపక్క ఒకవేళ బీజేపీ పొత్తు కుదుర్చుకోకపోతే ప్రత్యామ్నాయం గా కాంగ్రెస్ తో కలవడానికి డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలూ చేశాడు. బీజేపీ లో ఉన్న తన మనిషి అయిన సీఎం రమేష్ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 30 కోట్లు కాంగ్రెస్ కు ఇప్పించాడు. బీజేపీ ఎంపీ అయ్యుండి కాంగ్రెస్ కి ఫండ్ ఇచ్చిన ఘనత స్వాతంత్ర్య భారత చరిత్రలోనే మొదటి సారి అది సీఎం రమేష్ కు దక్కుతుంది.
ఇక మరోపక్క రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించడం లో బాబుది కీలకపాత్ర, తెలంగాణ లో రేవంత్ ను సీఎం చేయడానికి కాంగ్రెస్ కు విపరీతంగా ఫండింగ్ చేసిన బాబు, తన శిష్యుణ్ణి సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి తన వ్యవప్రయాసలనంతా సమకూర్చింది రేవంత్ కోసం అనుకుంటే పొరపాటే, రేవంత్ ద్వారా ఏపి లో లబ్ధిపొందాలి అనేది స్కెచ్. అందులో భాగంగానే షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి పంపాలి అని వేసిన పాచిక పారింది.. అందుకే షర్మిల కావచ్చు, సునీత కావచ్చు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న ఎవరైనా బాబుకు సొంతవారు అయిపోతారు. వారు తిరిగే ప్రత్యేక విమానాలు సీఎం రమేష్ సమకూరుస్తాడు.
బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేష్ కాంగ్రెస్ కు 30 కోట్ల ఫండ్ ఇవ్వడం, కాంగ్రెస్ నాయకులు సీఎం రమేష్ ప్రైవేట్ విమానాల్లో తిరగడం.. ఇదంతా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్. దాని అంతటికీ కర్తా కర్మ క్రియ బాబే.. ఇంతచేసినా గెలుస్తా అనే నమ్మకం ఉందా అంటే, అదీ లేదు.. ఏబీఎన్ రాధాకృష్ణ చెప్పినట్టు బాబు రాజకీయ జీవితం వైఫల్యం గా ముగియనుంది.