ఏపీ అప్పుల విషయంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మార్కాపురం ప్రజాగళం సభలో మరోసారి ఈ అంశంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాశారు. ‘సంక్షేమ పథకాల పేరుతో పది రూపాయలు ఇచ్చి రూ.100 దోచుకున్నాడు జగన్. సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచుతాం. అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా? సంపద సృష్టించే ముఖ్యమంత్రి కావాలా? రూ.13 లక్షల కోట్ల అప్పు సాక్షి పత్రిక, భారతి సిమెంట్ కడతాయా?.. ప్రజలే కట్టాలి’ అన్నారు. ఒకసారి వాస్తవాలు పరిశీలిస్తే ఏపీని అప్పుల్లో ముంచింది బాబేనని స్పష్టమవుతోంది.
ఆ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశ వ్యాప్తంగా రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటు తదితర అంశాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. దాని ప్రకారం రూ.8.34 లక్షల కోట్లకు పైగా అప్పులతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ రూ.4.85 లక్షల కోట్లతో ఏడో స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీతోపాటు వృద్ధి రేటు క్షీణించింది. మన రాష్ట్రాన్ని మినహాయిస్తే మిగిలిన చోట్లంతా అదే పరిస్థితి. ఏపీలో మాత్రం 2.1 శాతం వృద్ధి రేటు నమోదైందని మంత్రి ప్రకటించారు. ఆర్థిక సంఘం నిబంధనలు, సిఫార్సులకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు ప్రకటించారు. బాబు తన హయాంలో రూ.2.60 లక్షల కోట్ల అప్పులు చేశారు. జగన్ చేసింది అంతకు తక్కువే ఉంది.
అప్పుల విషయంలో పచ్చ గ్యాంగ్ ఐదేళ్లుగా దుష్ప్రచారం చేస్తూనే ఉంది. కానీ కేంద్రమే అనేకసార్లు గణాంకాలు విడుదల చేసినా బాబు అండ్ కో వీలు చిక్కినప్పుడల్లా నోటికొచ్చింది చెబుతూనే ఉంది. అధికారిక లెక్కలు అందరికీ అందుబాటులో ఉంటాయి. అయినా జగన్ ప్రభుత్వాన్ని తిట్టడమే వారి లక్ష్యం. సంపద సృష్టిస్తామంటున్న బాబే ఇప్పటి వరకు అధికంగా అప్పులు చేశారు. 2014 నుంచి 19 ఆయన సంక్షేమ పథకాలు అమలు చేసింది అంతంతమాత్రమే. ఎన్నికల సమయంలో హడావుడిగా కొన్ని అమలు చేశారు. మరి అంత డబ్బు ఎక్కడికి పోయిందంటే పెత్తందారుల జేబుల్లోకే కదా.. జగన్ ప్రభుత్వం నిబంధనల ప్రకారమే అప్పులు చేసింది. వాటిని సంక్షేమ పథకాల రూపంలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. బాబు వస్తే ఆదాయం పెరిగేది రాష్ట్రానికి కాదు.. తన హెరిటేజ్ సంస్థకు.. అనుయాయులకు చెందిన కంపెనీలకు.. ఇది జగమెరిగిన సత్యం.