సాంప్రదాయినీ.. సుప్పినీ.. శుద్ధ పూసనీ.. ట్రెండింగ్లో ఉన్న ఈ సాంగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి కరెక్ట్గా సరిపోతుంది. భారతీయ జనతా పార్టీ అంతు చూస్తానని 2019 ఎన్నికల సమయంలో గర్జించిన ఆయన ఇప్పుడు అదే పార్టీతో పొత్తు కోసం పాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి కూడా వెళ్లారు. దీంతో సోషల్ మీడియాలో బాబు ఒకప్పటి వ్యాఖ్యలు, ఎల్లో మీడియా ఇచ్చిన బిల్డప్లు వైరలవుతున్నాయి.
2019 ఎన్నికలకు ముందు నారా వారు బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్తో జతకట్టారు. దేశంలోని వివిధ పార్టీల అధినేతల్ని కలిశారు. దీంతో ఇక్కడి ఎల్లో మీడియా రెచ్చిపోయింది. ప్రధాని నరేంద్రమోదీకి బాబు సినిమా చూపిస్తున్నారని కొందరు డిబేట్లలో భజన చేశారు. ఇంకో హైలెట్ ఏంటంటే ‘కనిపిస్తే కొడతారేమో.. తానంటే మోదీకి అంత కసి ఉంది’ అని అప్పట్లో బాబు చెప్పినట్లు పచ్చ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈయన అమెరికాకు వెళ్లగా భారత్కు కాబోయే ప్రధానమంత్రి అంటూ అక్కడి జనం భావించారని ఈనాడు కథనం వేసి మురిసిపోయింది. ప్రధాని పీఠాన్ని ఆఫర్ చేస్తే బాబు ఎలా స్పందిస్తారో అంటూ ఏబీఎన్ చర్చలు నడిపింది. ఇక్కడ నారా లోకేశ్ మాటల్ని కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. తన కొడుకు హైస్కూల్లో చదివే సమయంలోనే మీకు ప్రధాని పదవి కంటే సీఎం పదవే మేలని రాష్ట్రానికి ఎక్కువ సేవ చేయొచ్చని చెప్పాడని చంద్రబాబు సెలవిచ్చారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో బాగా నవ్వులు పూయించాయి. అయితే చాలా విధాలుగా తన ప్రధాని ఆశలను బాబు 19లో ఎల్లో మీడియా ద్వారా బయటపెట్టారు. ఇంకేముంది టీడీపీ అధినేత పీఎం అవుతారు. ఇక్కడ లోకేశ్ సీఎం అవుతారంటూ ఎల్లో గ్యాంగ్ కలల్లో మునిగిపోయింది. వారి మీడియా దీనినే ప్రొజెక్ట్ చేసింది. తీరా మోదీ భారీ విజయం సాధించి మళ్లీ గద్దెనెక్కారు. దీంతో ఒకప్పుడు బాబు మోదీకి దేశభక్తి లేదన్న నోటితోనే ఆయన్ను పొగడాల్సి వచ్చింది. ఇక కేసులకు భయపడి కమలం పెద్దల ముందు సాగిలపడాల్సి వచ్చింది.
ఇప్పుడు కూడా పొత్తు కోసం చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్రయత్నిస్తోంది గానీ.. బీజేపీ అధిష్టానం కాదు. కానీ ఇక్కడ ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ఇచ్చే బిల్డప్లు అంతా ఇంతా కాదు. బాబు గెలుస్తున్నాడు కాబట్టి బీజేపీ పిలిచిందంట.. బీజేపీ గెలుస్తుంది కాబట్టి బాబు వెళ్లారట. ఫేస్బుక్లో ఓ తెలుగు తమ్ముడి పోస్టు ఇది. వీళ్ల దృష్టిలో ప్రధాని నరేంద్రమోదీ కంటే బాబే బలవంతుడు. తనకు ఇవే చివరి ఎన్నికలని, గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని, లేకపోతే విరమించుకుంటానని ప్రజల్ని బెదిరిస్తున్న వ్యక్తి వీళ్ల దృష్టిలో గొప్ప విజనరీ. చూసేవారికి ఇదంతా చిల్లరతనంగా అనిపిస్తోందని కూడా తమ్ముళ్లకు అనిపించదు. బాబు కావొచ్చు.. టీడీపీ నేతలు కావొచ్చు.. అవసరం కోసం ఎవరినైనా తిట్టిపోస్తారు. కాసేపటికి వారినే కౌగిలించుకుంటారు. చేతిలో అధికారం ఉండాలి. డబ్బు సంపాదించుకోవాలి. ఇదే వీరికి తెలిసింది. ఇంతకీ తమ్ముళ్లూ పసుపు చొక్కాలు పడేసి కొత్త రంగులతో మళ్లీ కుట్టించుకున్నారా లేదా? మీ నాయకుడి సంగతి తెలిసిందే కదా అని.. 2014వి అలాగే ఉంచుకొని ఉంటే బాగుండేది కదా..