చంద్రబాబు కరువు కవలపిల్లలు అని తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుండో ఒక నానుడి ఉంది. చంద్రబాబు అధికారం చేపడితే వర్షాలు పడవని. పంటలు పండవని, రైతులు దుర్భిక్షంతో అల్లాడిపోతారని , పొలానికి ఉపయోగించాల్సిన పురుగుమందే రైతన్నలకి పెరుగన్నం అవుతుందని పెద్దలు చెప్పే మాట.. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం ఇవన్ని గిట్టని వాళ్ళు చేసే దుష్ప్రచారమని కొట్టిపారేస్తూ ఉంటారు.
తెలుగుదేశం వాళ్ళు చెప్పే మాటలు నిజమా , లేక ఎప్పటి నుండో రాష్ట్రంలో నానుడిగా ఉన్న మాట నిజమా అని పరిశీలించి చూస్తే తన పాలన కరువుమయమని స్వయంగా చంద్రబాబే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక ఉదహరణగా చూస్తే 2003లో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు కరువుపై స్టేట్మెంట్ ఇచ్చారు.
నాడు చంద్రబాబు ఇచ్చిన ఆ స్టేటమెంట్ చూస్తే ” గత రెండు, మూడు సంవత్సరాలుగా వరుసగా కరువు రావడం వల్ల కూడా మనం చాలా యిబ్బందులపాలయ్యాము. గత సంవత్సరం కూడా కరువు వచ్చింది. మనకు నార్మల్ రెయిన్ ఫాల్ 848.7 మిల్లీమీటర్లు కాగా 573.8 మిల్లీమీటర్లు వర్షపాతం మాత్రమే పడింది. టోటల్గా 32% వరకు డీవియేషన్ వచ్చింది. గత 40 సంవత్సరాల కాలాన్ని పరిశీలించినట్లయితే ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ పడలేదు. 1960 నుండి 2003 వరకు కంపేర్ చేసినప్పటికీ ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ పడలేదని తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరిగా మన పంటల ఉత్పాదకత కూడా గత ముప్పది సంవత్సరాలతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం తక్కువంగా వుంది. మనం దెబ్బతిన్నాము.” ఇది చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ .
గత నలభై ఏళ్ల కాలంలో నా పాలనలో ఉన్నంత కరువు ఎప్పుడూ లేదని బాబు నోటితోనే తన దరిద్రం గురించి చెప్పుకొన్నట్టు అయ్యింది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 40 సంవత్సరాల తక్కువ వర్షపాతం నమోదవ్వడం. అలాగే పంటల ఉత్పాదకత కూడా 30 సంవత్సరాలతో పొల్చితే తక్కువ ఉండటం వెరసి చూస్తే చంద్రబాబు పాలన అందరు చెబుతునట్టు కరువు మయం అని అర్ధమవుతుంది. ఈ పరిస్థితులే నాడు చంద్రబాబు కరువు ఇద్దరు కవలపిల్లలని ప్రచారంలోకి రావడానికి ముఖ్య కారణంగా కనిపిస్తుంది. చంద్రబాబు సైతం అసెంబ్లీలో ఒప్పుకోవడం కొసమెరుపు.