అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మించిన వారు ఉండరు. పదవి కోసం ఎంతకైనా దిగజారుతాడు. ఏ విషయంపై అయినా బాబుకు రెండు, మూడు స్టాండ్లు ఉంటాయి. ఎప్పుడు ఏది అవసరమైతే అది వాడేస్తారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల్లో ఇదే పని చేస్తున్నారు.
2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. జన్మభూమి కమిటీల్లాంటివి పెట్టకుండా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూర్చింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో ఎల్లో గ్యాంగ్ భయపడిపోయింది. జనమంతా జగన్ వైపు వెళ్లిపోవడంతో అబద్ధాలు ప్రచారం చేయడం ప్రారంభించింది. ప్రభుత్వం రిజర్వ్ బ్యాంకు పరిమితులకు లోబడి అప్పులు చేసినా.. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని పచ్చ పత్రికలు రాశాయి. చంద్రబాబు అండ్ కో వీలు చిక్కినప్పుడల్లా ఏపీ మరో శ్రీలంక అయిపోయిందని, సోమాలియాలా మారిందని చెబుతూ వచ్చారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురందేశ్వరిలు బాబు పంపే స్క్రిప్ట్లు చదువుతూ జగన్పై బురద చల్లుతూ వచ్చారు. పేదలకు పథకాలు ఇవ్వడాన్ని వారు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఇక ఆయా పార్టీల సోషల్ మీడియా సభ్యులైతే జనాన్ని ప్రభుత్వం సోమరిపోతుల్ని చేస్తోందని పోస్టులు పెట్టారు. అప్పుల విషయమై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం నిజాలు చెప్పినా వినకుండా నోటికొచ్చింది ప్రచారం చేశారు.
2024 ఎన్నికలు వచ్చాయి. సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు జనం సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ముందుకొచ్చారు. రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని చెప్పిన నోటితోనే జగన్ కంటే రెట్టింపు సంక్షేమం ఇస్తానని ప్రజాగళం సభల్లో బాబు చెబుతున్నారు. మూడు పార్టీల అభ్యర్థులు దీనినే ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పథకాలు ఇస్తుంటే ఏడ్చిన మీరు రెట్టింపు పథకాలిస్తామని ఎందుకు మోసం చేస్తున్నారని ప్రజానీకం ప్రశ్నిస్తోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే జగన్ పథకాలను తీసేస్తారనే భయం జనంలో ఉంది. అందుకే బాబు సూపర్సిక్స్ అంటూ ఊదరగొడుతున్నా నమ్మడం లేదు. 2014లో సీఎం అయిన నారా వారు సంక్షేమ పథకాలు పెద్దగా లేకుండానే ఏపీని అప్పులమయం చేశారు. కాకపోతే ఎల్లో మీడియా చేతిలో ఉండడంతో ఓటర్లను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం కుర్చీ కోసం ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతాడో..