2024 టీడీపీ టికెట్ల కేటాయింపులో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అనే రూల్ పేరుతో టీడీపీ సీనియర్ నాయకులకు చెక్ పెట్టిన చంద్రబాబు నాయుడు , యనమల రామకృష్ణుడు కుటుంబానికి మాత్రం నాలుగు సీట్లు కేటాయించారు.
టీడీపీలో ఒక కుటుంబానికి ఒకటే టికెట్ పేరుతో పరిటాల, కోట్ల, కే ఇ , చింతకాయల అయ్యన్నపాత్రుడు,ఇలా సీనియర్ నాయకులకు మొండి చెయ్యి చూపించిన చంద్రబాబు నాయుడు యనమలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం టీడీపీ వర్గాలను ఆశ్చర్యలకు గురి చేస్తుంది.
యనమలకు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, ఇక ఇప్పుడు యనమల కూతురికి తుని అసెంబ్లీ కి అవకాశం కల్పించారు, యనమల వియ్యంకుడు అయిన పుట్టా సుధాకర్ యాదవ్ కు మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. తాజాగా టీడీపీ మూడో విడత జాబితాలో ఏలూరు ఎంపి అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు తనకు అల్లుడూ అయిన పుట్టా మహేష్ యాదవ్ కు అవకాశం కల్పించారు చంద్రబాబు. ఇప్పుడు ఇదే టీడీపీ నేతల్లో చర్చకు దారితీసింది.
చంద్రబాబు నాయుడు ఎన్టీయార్ ను గద్దె దించిన సమయంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏడిపించారు . అలాగే ఎన్టీఆర్ వర్గాన్ని తన అధికారాలతో అనగతొక్కారు. దానికి ప్రతి ఫలంగా ఈరోజుకి కూడా చంద్రబాబు నాయుడు యనమలకు భయభక్తులతో అత్యంత విలువ ఇస్తున్నారు అని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు ..
ఇప్పుడు యనమల రామకృష్ణుడు కి ఇచ్చిన సీట్లు చూసి కోట్ల, చింతకాయ అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత తమ వారసులకు అవకాశం కల్పించామని చంద్రబాబు నాయుడును డిమాండ్ చేస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. చూడాలి ఈ సీట్ల పంపకం టీడీపీ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోందో..
ఏదేమైనా కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న నిబంధన అడ్డం పెట్టి సీనియర్లకి చెక్ పెట్టిన బాబు యనమల కుటుంబానికి నాలుగు సీట్లు ఇవ్వడంతో యనమల కుటుంబ సభ్యులు అందరూ వేరు పడి కొత్త కుంపట్లు పెట్టారని టీడీపీ సీనియర్స్ సెటైర్స్ వేస్తున్నారట.