అధికారం కోసం అమలు చేసే ఉద్దేశ్యం లేని హామీలను గుప్పించే చంద్రబాబు చేతిలో గుంటూరు జిల్లా దగాకు గురైంది. అధికారంలోకి రాక ముందు చంద్రబాబు గుంటూరు జిల్లాకు ఇచ్చిన హామీలను అధికారం దక్కాక వాటిని అమలుచేసిన తీరును ఓసారి పరిశీలిస్తే గుంటూరు జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదనే విషయం బోధపడుతుంది. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరచక పోవడం చంద్రబాబు గొప్పతనంగా చెప్పొచ్చు. గుంటూరు జిల్లా బాబు చేతిలో ఎలా మోసపోయిందో, గుంటూరు జిల్లాకు ఇచ్చిన హామీలను పరిశీలిద్దాం.
బాబు గుంటూరుకు ఇచ్చిన హామీలు
– వీజీటీఎం మెట్రో రైలు
– వ్యవసాయ విశ్వవిద్యాలయం
– ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
– జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ
– టెక్స్టైల్ పార్క్
– స్మార్ట్ సిటీ
– ఫుడ్ పార్క్
– టూరిజం సర్క్యూట్గా నాగార్జున కొండ- అమరావతి
– నాగార్జున సాగర్ ఎయిర్పోర్టు
– నాగార్జున సాగర్ థీమ్ పార్క్
– సౌర విద్యుత్ కేంద్రం
వీజిటీఎం మెట్రో రైలు అనగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మీదుగా మెట్రో రైలు అంటూ మొదటి హామీ గుప్పించిన చంద్రబాబు గెలిచిన అనంతరం ఈ హామీని గాలికి వదిలేసాడు. వీటి డెవలప్మెంట్ కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా చంద్రబాబు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. కొత్తగా వ్యవసాయం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని వట్టి మాటలు చెప్పిన చంద్రబాబు దాన్ని ఏర్పాటు చేయడం దేవుడెరుగు ముందునుండి ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినా ఆవైపుగా అడుగులు వేసే ప్రయత్నం చేయలేదు.
టెక్స్టైల్ పార్క్,స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్క్ ఇలా ఈ మూడు హామీలలో ఒక్క హామీని అమలుచేసే దిశగా కూడా చంద్రబాబు అడుగులు వేయలేదు. టూరిజం సర్క్యూట్గా నాగార్జున కొండ – అమరావతి హామీ ఇచ్చిన సంగతి కూడా చంద్రబాబుకు గుర్తు లేదు. నాగార్జున సాగర్ థీమ్ పార్క్ ఇలా గుంటూరు జిల్లాకు లెక్కలేని హామీల వర్షం కురిపించి ప్రజలను ఆశల్లో ముంచెత్తి నట్టేట ముంచాడు చంద్రబాబు. సౌర విద్యుత్ కేంద్రం పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితమయింది. ఇలా అమలుచేయలేని ఎన్నో హామీలను గుంటూరు జిల్లాకు ఇచ్చి చివరకు చంద్రబాబు మొండిచెయ్యి చూపాడు.