అసలే తేరగా వచ్చిన అధికారం, రైతులపై వారి కష్టాలపై కనీస అవగాహన లేని మనిషాయే, వ్యవసాయం చేసిన అనుభవమూ లేదాయే… ఇక రైతులపై చిన్న చూపు కాక మరేం ఉంటుంది… రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, వ్యవసాయం దండగ అందరూ కంప్యూటర్లు నేర్చుకుని సాఫ్టువేర్ జాబులు చేసుకోండి అని సెలవిచ్చిన బాబు ముందు నుండి రైతు వ్యతిరేకే…
పంటలు ఎండిపోతున్నాయి, చేతికొచ్చిన పంట నాశనం అవుతుంది అయ్యా దయచేసి నీరు విడవండి అని బతిమాలుకున్న పల్నాడు రైతులను కనీసం కనికరం లేకుండా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు బాబు.. 1999 లో నాటి టీడీపీ మాచర్ల ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని వెంట వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన పల్నాడు రైతులు ఇప్పుడు నీరు ఆపితే మిర్చి పంట దెబ్బ తింటుందని దయచేసి ఒక పదిహేను రోజులు అదనంగా నీరు విడిచిపెట్టమని రైతులు కోరగా, ససేమిరా కుదరదు అనీ, ఇలా అలవాటు చేస్తే పదే పదే అడుగుతారు, రైతులకు క్రమశిక్షణ అలవాటు చేయాల్సిందే అంటూ నీచమైన మాటలు మాట్లాడి వారి కష్టాన్ని చులకన చేశాడు బాబు…
రైతులకు క్రమశిక్షణ నేర్పాలి అనుకోవడం ఏమిటో, వారికి క్రమశిక్షణ లేదని బాబు ఎందుకు భావిస్తున్నాడో దేవుడికే తెలియాలి.. ఆరుగాలం కష్టం చేసి చమటని రక్తంలా చిందించి పంట పండించే రైతుకు క్రమశిక్షణ లేదా? తేరగా వచ్చిన అధికారం తాలూకా అహంకారంతో నోటికొచ్చిన మాటలు మాట్లాడే బాబుకు క్రమశిక్షణ లేదా? బాబుకు రైతులంటే ఎప్పుడు చిన్నచూపే. ఇవాళ ప్రజలకు అవగాహన వచ్చేసరికి రైతులపై ప్రేమున్నట్లు కపట నాటకాలు ఆడుతున్నాడు గానీ అధికారంలో ఉంటే బాబు తన అసలు స్వరూపాన్ని చూపడానికి ఏమాత్రం వెనకాడడు…