చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాను అభివృద్ధి చేస్తానని మాయమాటలు చెప్పి ఆ అభివృద్ధిని కృష్ణా నదిలో కలిపేసాడు. గద్దెనెక్కడం కోసం ఎన్నో హామీలను గుప్పించి ఇచ్చిన ఒక్క హామీని ఒక శాతం కూడా పూర్తి చేయకుండానే గద్దె దిగిన ఘనత చంద్రబాబు సొంతం. కృష్ణా జిల్లాకి ఇచ్చిన హామీలను ఓసారి పరిశీలిస్తే..
– ప్రస్తుత విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో విస్తరించడం
– మచిలీపట్నం పోర్టును అభివృద్ధి పరచడం
– ఆయిల్ రిఫైనరీ మరియు క్రాకర్ యూనిట్
– వీజీటీఎం మెట్రో రైలు
– ఆటోమొబైల్ మరియు లాజిస్టిక్స్ హబ్
– ఫుడ్ పార్క్
– మెగాసిటీ మరియు స్మార్ట్ సిటీ
– అక్వాకల్చర్ మరియు ప్రాసెసింగ్ యూనిట్
– భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ను విస్తరింపజేయడం
– టెక్స్టైల్ పార్క్
– టూరిజం సర్క్యూట్-భవానీ దీవులు
– అవనిగడ్డలో మిస్సైల్ పార్క్
– విజవాడలో ఐటీ హబ్
– కూచిపూడిలో కూచిపూడి అకాడమీ
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరుస్తానని చెప్పిన చంద్రబాబు, పదవిలో ఉన్న అయిదు సంవత్సరాలు కాలయాపన చేయడం మినహా ఎటువంటి పనులు చేయకపోవడం గమనార్హం. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెర్మినల్ బిల్డింగ్, కొత్త రన్ వేను ఏర్పాటు చేయడం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల పాటు మంచి ప్రాచుర్యంలో ఉన్న మచిలీపట్నం ఓడరేవు 1970 దశకం నుంచి మరుగున పడిపోయింది. చంద్రబాబు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న దీని పురోగతిని ఏనాడు పట్టించుకోలేదు. మచిలీపట్నం పోర్టును అభివృద్ధి పరుస్తానని చివరగా 2018లో ఒక శిలాఫలకం వేశాడు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే చేసిన చర్యగా భావించవచ్చు. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి రాగానే మచిలీపట్నం పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2023 మే నెలలో శంకుస్థాపనకు నోచుకోగా 2024 చివరి నాటికి మొదటి బెర్త్ పనులు పూర్తి చేసుకొని కార్యకలాపాలు చేసుకోవడానికి సిద్ధం చేస్తున్నారు.
ఆయిల్ రిఫైనరీ మరియు క్రాకర్ యూనిట్ వైపు అడుగులు పడినట్లు కూడా దాఖలాలు కనపడలేదు. వీజీటీఎం మెట్రో రైలు, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరిలను కనెక్ట్ చేస్తూ మెట్రో రైల్ వేస్తానని హామీ ఇచ్చినా కనీసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఏర్పాటుచేయలేకపోయాడు. అమరావతి కి అయిదు నిమిషాలు లో చేరుకునేలా సూపర్ ఫాస్ట్ రైల్ ఏర్పాటు అన్న చంద్రబాబు, కనీసం డబుల్ రోడ్డు కూడా సరిగ్గా వేయలేదు. ఆటోమొబైల్ మరియు లాజిస్టిక్స్ హబ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా అనడం, ఫుడ్ పార్క్, మెగా సిటీ & స్మార్ట్ సిటీ, ఆక్వా కల్చర్ & ప్రాసెసింగ్ యూనిట్, భారత్ ఎలక్ట్రానిక్స్ ను విస్తరింపజేయడం, టెక్స్టైల్ పార్క్, టూరిజం సర్క్యూట్ – భవాని దీవులు, అవనిగడ్డలో మిస్సైల్ పార్క్, విజయవాడలో ఐటీ హబ్ ఇలా చంద్రబాబు హామీలిచ్చినా ఒక్క హామీ కూడా ఆచరణకు నోచుకోలేదు. కూచిపూడిలో కూచిపూడి అకాడమీని ఏర్పటిచేసే ప్రయత్నం చేయలేదు. ఇలా లెక్కలేనన్ని హామీలు ఇవ్వడం ఏ ఒక్కటి చేయకపోవడం బాబుకే చెల్లింది. జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక జిల్లాల పునర్విభజన లో భాగంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేసి పాత కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పేరు పెట్టిన స్వాగతించలేని పరిస్థితికి చంద్రబాబు దిగిజారిపోవడం గమనార్హం.