అధికారం పోయాక మళ్లీ అధికారం కోసం ప్రతీ సారి టీడీపీచెప్పే ఓ చెత్త కబురు మేం సంపద శృష్టిస్తాం, శృష్టించిన సంపదను సంక్షేమానికి ఖర్చుపెడతాం అని… ఆ సంపదని ఎలా శృష్టిస్తారని అడిగితే మాత్రం ఎప్పటికీ సమాధానం ఉండదు. 1995-2004 మధ్యవారు శృష్టించిన సంపద ఎక్కడ దాచారు? ఎవరికి పంచారు అంటే సమాధానం ఉండదు. 1995-2004 మధ్య వరల్డ్ బ్యాంక్ వారికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి వారు చెప్పినట్లు నడవాల్సిన గత్యంతరం రాష్ట్రానికి పట్టించాడు బాబు. వారు చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం, కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్టు ఔట్సర్సింగ్ పేరుతో తక్కువ జీతంతో గొడ్డు చాకిరీ చేయించడం ఇవన్నీ బాబు చెప్పిన విజన్. 1995-2004 మధ్యలో ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్లని ఏడాదే లేదు. ఇక సంపద ఎక్కడ శృష్టించినట్లు..
2014 నుండి 2019 మద్యా అదే తీరు. పేరుకు పనికి వచ్చే ఒక్క సంక్షేమ పథకం ఉండదు, కానీ సంపద శృష్టిస్తాం వాటిని పంచుతాం అంటుంటారు. తీరా చూస్తే 2019 ఎన్నికల్లో ఓడిపోయాకా ఖజానాలో ఎంత మిగిల్చారు అంటే కేవలం వంద కోట్లు, ఈ విషయాన్ని ఈనాడు పత్రికే చెప్పింది.. ఐదేళ్లలో వారు శృష్టించిన సంపద అంతా ఎటు వెళ్లినట్లు? మళ్లీ కొత్తగా సంపద శృష్టిస్తాం అని తిరుగుతున్నారు.. ఎలా శృష్టిస్తారు అంటే సామాన్య ప్రజల మీద పన్ను భారం వేసి, ఉన్న పన్నులను పెంచి, లేని పన్నులను శృష్టించి( చెత్త మీద పన్ను వేయమని కేంద్ర ప్రభుత్వానికి సూచించిన ఘనుడు ఆయనే)… కార్పోరేట్ లకు, తన అనునాయులకు పన్ను మినహాయింపులు, కాంట్రాక్టులు కట్టబెట్టి పేదవాడి నడ్డి విరవడమే వారు శ్రష్టించే సంపద…