వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నట్లే తనకు పబ్లిక్లో మాస్ ఫాలోయింగ్ ఉండాలని కోరుకుంటాడు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన్ను ప్రజలు పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తుంటాడు.
ఇటీవల జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి ప్రజలు వెల్లువలా తరలివస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు జగన్ వెళ్తున్న బస్సు వద్దకు చేరుకుని ఆయనకు నమస్కారాలు పెడుతున్నారు. కొందరు మోకాళ్లపై కూర్చొని, మరికొందరు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఇంతటి అభిమానం జననేతకే దక్కిందని సోషల్ మీడియాలో ఫొటోలు వైరలయ్యాయి. పాపం వీటిని చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రి చంద్రబాబు చిన్నబోయాడు. తనకు అలాంటి ఫొటోలు ఉండాలని పార్టీ నేతలను ఆదేశించాడు. కానీ బూమరాంగ్ అయ్యింది.
ఉభయ గోదావరి జిల్లాలకు బాబు ప్రజాగళం యాత్రలో భాగంగా వెళ్లాడు. అక్కడే తెలిసిన కార్యకర్తల్ని పంపి నమస్కారం పెట్టించి ఫొటోలు తీసి ప్రచారం చేయాలని నేతలు అనుకున్నారు. కానీ జరిగింది వేరే.. గతంలో ఇంటింటికీ ఉద్యోగమిస్తానని మోసం చేసిన చరిత్ర మీది.. మళ్లీ ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి అంటూ అబద్ధాలు చెబుతున్నారు. నువ్వు మాకొద్దు బాబూ ఓ యువకుడు నారా వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. దీంతో అవాక్కైన ఎల్లో నేతలు, మీడియా అసలు విషయాన్ని దాచిపెట్టింది. రాష్ట్రానికి నీకే దిక్కని బాబుకు తెలుగుదేశం అభిమాని సాష్టాంగ నమస్కారం చేశాడని ఈనాడు ఎలివేషన్లు ఇచ్చింది. కానీ రోడ్షోకు వెళ్లిన వారందరికీ అతను ఎందుకు నమస్కారం పెట్టాడో తెలుసు. అయితే ఎల్లో గ్యాంగ్ మార్చి రాయడంతో అవాక్కయ్యారు.
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ప్రవర్తన ఉంటుంది. ప్రజాసంకల్ప యాత్ర ఎలా జరిగిందో అందరికీ తెలుసు. జగన్ ప్రజలతో బాగా మమేకయ్యారు. తన యువగళం పాదయాత్రలో లోకేశ్.. జగన్లా చేయాలని చూసి నవ్వులపాలయ్యాడు. జగన్ పేరు చెప్పగానే జనం గుండెల నిండా అభిమానంతో స్పందిస్తారు. అదే బాబు, చినబాబుల పేర్లు చెబితే కమెడియన్లను చూసి నవ్వినట్లు నవ్వుతారు. అందుకే కొన్ని పనులు చేయకూడదు. వైఎస్సార్ కుటుంబానికే జన బలం ఉంది. బాబుకు పెత్తందారుల అండ మాత్రమే ఉంది.