చంద్రబాబు ఒక కరుడుకట్టిన రాజకీయవాది. తనకి కుటిల రాజకీయం తప్ప మరొకటి తెలియదు. ప్రతీ పనిలోను, ప్రతీ అడుగులోనూ రాజకీయం మాత్రమే చూసే చంద్రబాబుకి మరొక సెంటిమెంట్ అంటూ ఏమీ ఉండదనేది జగమెరిగిన సత్యం , తాను అధికారంలోకి రావడం కోసం ప్రజలనే కాదు దేవుడిని సైతం వాడేసుకుంటాడని చంద్రబాబు రాజకీయ ప్రయాణం చూసిన వాళ్లు ఇట్టే చెప్పేయవచ్చు.
చంద్రబాబు ప్రజలు సెంటిమెంటుని పక్కన పెట్టి పుష్కరాల పేరిట గుడులు కూల్చి టాయిలెట్స్ కట్టించినా, ఫోటో షూట్లు పెట్టి ప్రజలను చంపించినా, బూట్లు వేసుకుని పూజలు చేసినా అది తప్పు అని ఆయనకి ఏమాత్రం అనిపించదు కారణం ఆయనకి దేవుడి పై భక్తీ , భయం రెండూ ఉండవు. అంటువంటి చంద్రబాబు గుడుల గురించి దేవుళ్ళ గురించి రాజకీయానికి తప్ప మరెందుకు మాట్లాడతాడనేది ప్రజల నుండి వస్తున్న ప్రశ్న.
తాను నెల్లిమర్ల వెళ్తే జగన్ ప్రభుత్వంలో రామతీర్థం రాముల వారికి జరిగిన అపచారం గుర్తొచ్చిందని ఇక్కడ రాముని తల నరికేసి కోనేరులో పడేసారు. అదే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరిగాయని. అంటూ ట్వీట్ వేసి భక్తుల మనోభావాలను కాపాడలేని ఈ జగన్, తనకు మళ్ళీ ఓటేయమని ఏ అర్హతతో అడుగుతున్నాడంటూ రాజకీయ రంగు పులిమేశారు చంద్రబాబు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనపై హిందు వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి ప్రతిపక్షాల ప్రోత్బలంతోనే గుడిలోని విగ్రహాలని టార్గెట్ చేసినట్టు పోలీస్ విచారణలో తేలింది. రామతీర్ధం లాంటి పూరాతన ఆలయాల్లో ఎవరు లేని సమయం చూసి విగ్రహాలు ద్వంశం చేయడం వెనుక రాజకీయ కుట్రలను పసి కట్టిన జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన అన్ని ఆలయాల్లోను తక్షణమే సీసీ కెమారాలని ఏర్పాటు చేసింది. అదే విచిత్రమో సీసీ కెమారాలు ఏర్పాటు చేసిన రోజు నుంఛీ ఒక్క దేవాలయంపై కూడా దాడి జరగలేదు, ఒక్క విగ్రహమూ డ్యామేజీ కాలేదు. దీంతో ఇక్కడే అర్ధమవుతుందు ప్రతిపక్షాల కుట్ర.
జగన్ పై ఎంత రాజకీయ కుట్ర చేసి హిందు వ్యతిరేకి అని చంద్రబాబు ముద్ర వేయాలని చూసినా అది వారికి సాధ్యపడలేదు. చంద్రబాబు కృష్ణా నది వెంబడి కూల్చిన గుడులని పునర్నిర్మాణం చేసిన జగన్ వాటికి పూర్వ వైభవం తెచ్చారు. అలాగే అప్పటి వరకు రామతీర్ధం గుడిలో వసతులు లేక నిరాధరణకు గురై ఉంటే జగన్ ప్రభుత్వం 3 కోట్లు పెట్టి వసతులు కల్పించారు, అంతర్వేదికి కొత్త రధాన్ని అందించారు. అలాగే కొన్ని చోట్ల గుడులపై దాడులు చేసిన టీడీపీ వారిని పట్టుకున్నారు. వాస్తవం ఇలా ఉంటే రామతీర్ధాన్ని అడ్డు పెట్టి రాజకీయం చేస్తే గతంలో చంద్రబాబు చేసిన తప్పులు సమసిపోతాయా అంటూ బ్రహ్మణ సమాజం సూటిగానే వేస్తున్న ప్రశ్న .