వలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇంకా కోపం తగ్గలేదు. పైకి ఎన్నికల సభల్లో మాత్రం వారిపై ప్రేమ నటిస్తూ.. లోపల దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నారు. వారిని సాధించే క్రమంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను ఇబ్బంది పెడుతున్నారు.
సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అని టీడీపీ జేబు సంస్థ ఒకటి ఉంది. దీనిని నిర్వహించేది రాష్ట్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రవేష్కుమార్. ఆ సంస్థ పనేంటంటే చంద్రబాబు చెప్పినట్లుగా వలంటీర్లపై కోర్టుల్లో కేసులు వేయడం. సుప్రీం, ఢిల్లీ, ఏపీ హైకోర్టుల్లో ఆ వ్యవస్థపై కేసులు వేశారు. తాజాగా నిమ్మగడ్డ ఆ సంస్థను అడ్డుపెట్టుకుని వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా పెట్టాలని పదేపదే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ నగదు పంపిణీ చేసే విధులను వలంటీర్లకు అప్పగించవద్దని, వారి నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అందుకునే లబ్ధిదారులు సుమారు 66 లక్షల మంది ఉన్నారు. చంద్రబాబు హయాంలో కేవలం సుమారు 39 లక్షల మంది మాత్రమేనని గమనించాలి. అప్పట్లో పింఛన్ల సొమ్ము తీసుకునేందుకు లబ్ధిదారులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. రోజుల తరబడి తిరిగాల్సి వచ్చేది. జగన్ హయాంలో వలంటీర్లు ప్రతినెలా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి కష్టాలు తప్పాయి. తాజా చంద్రబాబు, నిమ్మగడ్డ కలిసి పన్నిన కుట్రతో వారంతా మళ్లీ ఇబ్బంది పడనున్నారు.
ఎల్లో గ్యాంగ్కు మొదటి నుంచి వలంటీర్లంటే ఇష్టం లేదు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడంలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతో చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కత్తి కట్టారు. గోనెసంచులు మోసే ఉద్యోమని బాబు వెక్కిరించారు. ఇంట్లో మగవారు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడుతున్నారని అసభ్యంగా మాట్లాడారు. సేనాని అయితే చాలా దుర్మార్గంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని, దీంతో 30 వేల మంది అదృశ్యమయ్యారని గతేడాది అన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనా ఆయన వెకక్కి తగ్గలేదు. నారా వారి మనషులందరూ సేవా సైన్యంపై మొదటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఓ వైపు వీరి ఓట్ల కోసం బాబు ఎన్నికల్లో అనేక హామీలిస్తున్నారు. అదే సమయంలో నిమ్మగడ్డను ఉసిగొల్పి పేదలపై కక్ష తీర్చుకున్నారు.
సామాజిక పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వీరికి నేరుగా ఇంటికే నగదు అందుతోంది. కానీ పచ్చ గ్యాంగ్ చేసిన పనికి ఈసారి మండుటెండలో, అధికారుల చుట్టూ తిరిగి పెన్షన్ తీసుకోవాలి. చంద్రబాబు కుట్రలకు రాష్ట్ర ప్రజలు ఇంకెంత ఇబ్బందులు పడాలో..