చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాల కారణంగా పెన్షన్ దారులకి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంతకాలం ఇంటి వద్దకే వచ్చి అందించిన పెన్షన్ల కోసం ఇప్పుడు సచివాలయాల చుట్టూ పరుగులు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. కేవలం చంద్రబాబు తన స్వార్థపూరిత రాజకీయాల కోసం ఎన్నికల సమీపిస్తున్న వేళ వాలంటీర్లు పెన్షన్లు అందించకూడదు అంటూ కోర్టులో వేయించిన పిటిషన్ల కారణంగా పెన్షన్ల పంపిణీ ఒక్కసారిగా స్తంభించిపోయింది. సేవా భావంతో స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు కట్టిన కక్ష పెన్షన్ దారులు పాలిట శాపంగా మారింది. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు కారణంగా ఇంటి వద్దకే అందే పెన్షన్ల కోసం సచివాలయాల ముందు పడిగాపులు పడాల్సిన పరిస్థితి వచ్చింది.
సచివాలయాలు ఉన్నచోట కాస్త ఇబ్బంది అయినా ఏదో ఒక రకంగా పెన్షన్లు పంపిణీ చేయొచ్చు అనుకోవచ్చు. మరి సచివాలయాలు లేని గ్రామాల పరిస్థితి ఏంటి? ఈ సచివాలయాలను గ్రామాలలో జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు కొన్నిచోట్ల అయితే రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక సచివాలయం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సచివాలయాలు లేని గ్రామాలు దాదాపుగా 7600 పైచిలుకు… చంద్రబాబు స్వార్ధ పూరిత కుట్రల వల్ల ఇప్పుడు ఈ గ్రామాల ప్రజలు పెన్షన్ కోసం దాదాపుగా నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల మేర వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాలు ఒకటో అంతస్థులో ఉన్నాయి. వికలాంగులు, నడవలేని పెద్ద వయసు ఉన్నటువంటి అవ్వ తాతలు కార్యాలయంలోకి వెళ్ళేది ఎలా? లబ్ధిదారులు సచివాలయం వద్దకు చేరుకోవటానికి రవాణా సౌకర్యాలు కల్పించేది ఎవరు? నడవలేని కదలలేని స్థితిలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? గ్రామాల్లో సచివాలయాల వద్ద టెంట్లు మంచినీటి ఏర్పాట్లు చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ తన ప్రాంతాల్లో అది కూడా ఈ మండువేసవిలో అలాంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి ఉంటుందా…
రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అయితే వాళ్లలో చాలామంది చిరునామాలు ఒకచోట ఉంటే.. వేరే చోట నివసిస్తూ ఉంటారు. కొంతమంది ఆసుపత్రిలో కదరలేని పరిస్థితిలో ఉంటారు.. మరి కొంతమంది వికలాంగులు నడవలేని స్థితిలో ఉంటారు.. అందరికీ కూడా వాలంటీర్లు ఒకటో తారీఖున టంచన్ గా ఎక్కడున్నా సరే వెతుకుంటూ వెళ్లి పెన్షన్ చేతికిచ్చి వచ్చేవారు.. గిరిజన ప్రాంతాల్లో పెన్షన్ దారులు కష్టాలు అంతా అంతా కాదు.. సమాచారాన్ని అందించడమే చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకి ఏ సమాచారం అందించాలన్న వాలంటీర్లు. ద్వారానే జరగాలి. ప్రాంతాల్లో నివసించే పెన్షన్దారులు సుమారుగా 11 లక్షల మంది.. అందరికీ పెన్షన్లు అందించడం ప్రభుత్వానికి ఇప్పుడు ఒక సవాల్ గా మారింది. ఈ పెన్షన్ దారులలో కొంతమంది వయసు మళ్ళిన వారికి వేలిముద్రలు సరిగా పడవు. ఐరుష్ సరిగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సమయాన్ని వెచ్చించి ఓపికగా చాలా బాధ్యతగా ఆ పని పూర్తి చేసి అర్హుడికి పెన్షన్ ఇచ్చి వచ్చేవారు.
మరి కొంతమంది వ్యాధిగ్రస్తులు హాస్పిటల్లో ఉన్నవాళ్లు మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ వాలంటీర్లే ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ సేవా దృక్పథంతో వాళ్ళ దగ్గరకు వెళ్లి పెన్షన్ అందించేవారు. ఇది ఈరోజు కొత్తగా జరుగుతున్నటువంటి పెన్షన్ పంపిన విధానం కాదు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండే దాదాపుగా అంటే 58 నెలల నుండి వాలంటరీ వ్యవస్థ ద్వారానే ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. వాలంటరీ వ్యవస్థ ఎన్నికల కోసం వచ్చినటువంటి విధానం కాదు.. పెన్షన్దారులకు ఇబ్బందులు కలగకుండా సేవా దృక్పథంతో పని చేయడానికి తీసుకువచ్చిన వ్యవస్థ. మరి ఎందుకు చంద్రబాబుకి వాలంటరీ వ్యవస్థ పై ఇంత కక్ష.. జగన్ తీసుకొచ్చిన పెన్షన్ ఇంటికి పంపే విధానాన్ని, వాలంటరీ వ్యవస్థను జగనే తప్పించాడు అంటే ప్రజలు నమ్ముతారు అనుకోవడం అత్యాశే… తప్పుడు ప్రచారాలతో లాభం పొందాలనుకున్న చంద్రబాబు కి ఈ వాలంటరీ వ్యవస్థ విషయంలో మాత్రం నిరాశే మిగిలింది. ఇది కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు అండ్ కో వేసుకున్న సెల్ఫ్ గోల్ అనడంలో ఎలాంటి సందేహము లేదు. చంద్రబాబు చేసిన కుట్రలు కుతంత్రాలు దావానలంలా వ్యాపించి చంద్రబాబును టిడిపిని దహించి వేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.