వలంటీర్లపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు, టీడీపీ శ్రీశైలం అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రిటర్నింగ్ అధికారి కె.సుధారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. ఆత్మకూరు పట్టణంలో మార్చి 19న తెలుగుదేశం నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశంలో రాజశేఖర్రెడ్డి వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తన అనుచరులతో జరిగిన సమావేశంలో వాలంటీర్లు ప్రజాధనాన్ని తీసుకుని అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీ సభ్యులకు సూచించారు. వాలంటీర్లు ఎక్కడైనా అధికారపక్ష పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే భౌతిక దాడులు చేయండి, నేను చూసుకుంటా అంటూ బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఒకవేళ వాలంటీర్లు అధికార పక్షం వైపు ప్రచారం నిర్వహిస్తే,వాళ్ళు ప్రచారం నిర్వహించే సమయంలో ఒక ఫోటో తీసుకొని సీ విజిల్ యాప్ లో ఫిర్యాదు చేస్తే, ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది అలాంటిది భౌతిక దాడులు చేయాల్సిన అవసరం ఎవరికి లేదు, ఎందుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులను ఇలా ప్రేరేపిస్తున్నాడు.ఈ విషయమై వాలంటీర్లు సంఘం రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.సుధారాణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం కేసు నమోదు చేశారు.
రోజు రోజుకీ వాలంటీర్లుపై దాడులు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో చిత్తూర్ జిల్లా పలమనేరు నియోజవర్గం మాజీ మంత్రి, ఎమ్మెల్యే యన్. అమర్నాథ్ రెడ్డి అనుచరులు వాలంటీర్లు పై తీవ్రంగా దాడి చేశారు, సత్య సాయి జిల్లా హిందూపురం నియోజక వర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులు ఒక వాలంటీర్ తల పై కట్టెతో కొట్టడంతో సదరు వాలంటీర్ హాస్పిటల్ లో జాయిన్ కావాల్సిన పరిస్థితి. టిడిపి పార్టీ తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను, ఇప్పుడు ఉన్న వారిని కొనసాగిస్తాం అంటూనే వాలంటీర్లుపై భౌతిక దాడులు చేయమని ప్రోత్సహిస్తోంది.