మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో చేనేతలకు పూర్వ వైభవం తెస్తానని లోకేష్ హామీ ఇచ్చాడు.. గత చరిత్ర చూస్తే టీడీపీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు లాంటివి. ఒక్కో కులానికి అరడజను చొప్పున హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి మేనిఫెస్టో ని టీడీపీ వెబ్సైట్ నుండి తొలగించిన చరిత్ర వారిది. ఇక చేనేతల విషయానికి వస్తే, చేనేతలకు ఇల్లు షెడ్డు కలిపి ఒకే చోట నిర్మిస్తాం అని యువగళం లో పలుమార్లు హామీ ఇచ్చాడు లోకేష్. కాగా అచ్చం ఇలాగే ఇల్లు, వర్క్ షెడ్ కలిపి లక్షన్నరతో ఒకేచోట నిర్మిస్తాం అని 2014 లో హామీ ఇచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మించలేదు..
ఇదొక్కటేనా…..
2014 లో ఇచ్చిన మిగతా హామీలను పరిశీలిస్తే:
1.చేనేతలకు గుర్తింపు కార్డులు.( ఒక్క గుర్తింపు కార్డు కూడా ముద్రింపబడలేదు)
2.చేనేత సహకార భవనాలకు అన్ని రకాల పన్నుల నుండి మినహాయింపు.( పన్ను మినహాయింపు కాదు కదా కొత్తగా పన్నులు విధించిన దాఖలాలు ఉన్నాయి)
3.జరీపై విధించిన వ్యాట్ రద్దు.. ( రద్దు చేయకపోగా కేంద్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాగా ఎన్డీయే లో భాగస్వామి అయ్యుండి కూడా కిక్కురు మనకుండా అమలు పరచారు).
4.చేనేత కార్మికుల రుణ మాఫీ. పవర్ లూమ్స్ పై ఉన్న రుణాల రద్దు( రాష్ట్రం లో మొత్తం మీద కేవలం 2500 లోపు మందికే రుణమాఫీ చేశారు).
5.చేనేత కార్మికులకు ప్రతీ ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయింపు ( ఒక్క రూపాయి కేటాయించినట్లు 5 ఏళ్ల కాలంలో ఏ బడ్జెట్ లోనూ ప్రస్తావన లేదు).
6.రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు తెరుస్తాం ( ఇవి రాష్ట్రంలో ఎవరూ కంట చూడని బజార్లు).
7.ఉచిత ఆరోగ్య భీమా కల్పిస్తాం, చేనేత పెన్షన్ 1000 కి పెంచుతాం( అందరితోపాటు ఇచ్చిన పెన్షనే ఇది చేనేతలకు ప్రత్యేకంగా పెన్షన్ కార్యక్రమము లేదు).
8.జిల్లాకు ఒక చేనేత పార్కును ఏర్పాటు చేసి, కార్మికులకు ఉపాధి మరియు శిక్షణ కల్పిస్తాం( ఏ జిల్లాలో ఏర్పాటు చేసారు ? ).
9.వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, మొదలైన ప్రాంతాల్లో ఆస్పత్రి, వృద్ధాశ్రమాలు నిర్మిస్తాం( ఒక్క ఆస్పత్రైన నిర్మించిన చరిత్ర ఉందా, వృద్ధాశ్రమాల గురించి తక్కువ మాట్లాడుకోవాలి).
10.సగం ధరకే జనతా వస్త్రాలు. జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ( ఈ పథకం ఒకటి ఉందని ఎవరికైనా తెలుసా?).
11.మగ్గాలకు ఉచిత విద్యుత్( ఉన్న విద్యుత్ సరఫరా రేట్లు తగ్గిస్తే చాలనుకునే స్టేజి కి తీసుకొచ్చారు).
12.చేనేత వస్త్ర విక్రయాలపై 30% రిబేటు( కొన్న వారు ఎవరో కాస్త చెప్పండి).
ఇలా చెప్పుకుంటూ పోతే చేనేతలకు ఇచ్చిన హామీలు ఇంకా ఉన్నాయి .. కానీ ఒక్కటంటే ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదు. నేడు మంగళగిరిలో చేనేతలు ఎక్కువగా ఉన్నారని వారి ఓట్లకోసం చేనేతలకు పూర్వ వైభవాన్ని కల్పిస్తాం అని నారా లోకేష్ మాట్లాడటం అత్యంత హాస్యాస్పదం. అసలు చేనేతలు వారి వైభవాన్ని కోల్పోవడానికి కారణం ఎవరు? కుల వృత్తుల నడ్డి విరిచి, కార్పోరేట్ రంగాన్ని ఉద్ధరించడానికి బ్రిటిష్ వారితో సమానంగా భారతీయ చేతి వృత్తులకు అన్యాయం చేసింది టీడీపీ పార్టీ నే అన్న సంగతి రాష్ట్రంలో ప్రతీ చేనేతకు, చేతి వృత్తుల వారికి సంపూర్ణ అవగాహన ఉంది..