జనసేన పార్టీనీ నిలబెట్టిన ఏకైక నియోజకవర్గం అయిన రాజోలులో ఈరోజుతో జన సేన పార్టీ నిండా మునిగిపోయింది. పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం చేసిన అనాలోచిత నిర్ణయాల వలన రాజోలులో పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్ధిగా కోరిన బొంతు రాజేశ్వరరావుకు కాకుండా దేవ వరప్రసాద్ కు టికెట్ ఇవ్వడం అందులో నిన్న బి ఫారం కూడా ఇవ్వడంతో జన సేన పార్టీ కి చెందిన కీలక నాయకులు, కార్యకర్తల మద్దతుతో పవన్ కళ్యాణ్ చేసిన మోసంకు కలత చెందిన బొంతు రాజేశ్వరరావు జన సేన పార్టీ కి రాజీనామా చేసి రేపు కాకినాడలో సియం జగన్ సమక్షంలో తన పాత గూటికి చేరుకోపోతున్నారు. ఈ సంఘటనతో రాజోలులో జన సేన పార్టీ అనేది తుడిచి పెట్టుకుపోయినట్టే. 2019లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన రాజోలు జన సైనికులు పార్టీ తరుపున రాపాక వరప్రసాద్ ను గెలిపించి రాష్ట్రంలో ఉనికి కాపాడారు.
అలాంటి చోట పవన్ కళ్యాణ్, పార్టీ పెద్దలు, నాదెండ్ల మనోహర్ చేసిన అవమానాలు భరించలేక రాపాక వరప్రసాద్ వైసీపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి రాజోలులో జనసేన కార్యకర్తలకు నియోజకవర్గంలో నాయకుడు అనేవారు లేకుండా వున్న సమయంలో బొంతు రాజేశ్వరరావు వైసీపీ కి రాజీనామా చేసి జన సేన పార్టీలో చేరి పార్టీని మళ్ళీ గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో బొంతు రాజేశ్వరరావు రెండు సార్లు అతి తక్కువ మెజారిటీ తో ఓడిపోయారు అని ప్రజల్లో కూడా సానుభూతి వెల్లువెత్తి ఈసారి రాజోలులో బొంతు రాజేశ్వరరావు గెలుపు ఖాయం అనే రీతిలో పేరు, ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం డబ్బులకు ఆశ పడి ప్రజా బలం వున్న బొంతు రాజేశ్వరరావును కాదని దేవ వరప్రసాద్ కు టికెట్ ఇచ్చి బి ఫారం ను ఇవ్వడంతో ఇక జనసేన లో వుండడం పని చెయ్యడం వృధా అని భావించి జనసేన పార్టీకి చెందిన మూడు మండలాల పరిధిలోని నాయకులు , కార్యకర్తలతో చర్చించి జన సేన పార్టీకి రాజీనామా చేశారు. రేపు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో కాకినాడలో తిరిగి తన సొంత గూటికి చెరుకోపోతున్నారు.
ఈ దెబ్బతో రాజోలు లో జనసేన పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.