సార్వత్రిక ఎన్నికల ముందు బిజెపి అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పత్రిక ప్రకటన విడుదల చేసింది. అరకు ఎంపీ అభ్యర్థిత్వం పై నిమ్మక జయరాజు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, జయరాజుని ఆ పార్టీ బహిష్కరించింది. కూటమిలో భాగంగా అరకు ఎంపీ సీటు బిజెపికి దక్కింది. అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. అరకు ఎంపీ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిమ్మక జయరాజు కు టికెట్ కేటాయించక పోవడంతో , బిజెపి పార్టీ రాష్ట్ర అధిష్టానం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీకి అది నుంచి పని చేసిన వారు కనపడడం లేదు అనే వ్యాఖ్యలు కూడా చేశారు.
కొత్తపల్లి గీత అభ్యర్థిత్వంపై పార్టీ సీనియర్ నాయకుడైన నిమ్మకు జయరాజు తీవ్రంగా వ్యతిరేకించాడు. అసలు కొత్తపళ్లి గీత ఎస్టీనే కాదు అని వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేయడమే కాక, బిజెపి అధిష్టానాన్ని ప్రశ్నించడం.. ఈ విషయమై మీడియాకి ఎక్కి నానా రచ్చ చేయడంతో బిజెపి అధిష్టానం పరువు తీసేలా చేసిన చర్యల వల్ల అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
బిజెపి అధిష్టానం టికెట్ కేటాయించిన కేటాయించక పోయిన తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే స్పష్టం చేశారు. ఆ దిశగా నేడు కురుపం స్వతంత్ర అసెంబ్లీ అభ్యర్థిగా నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేపు అరకు ఎంపీ స్థానం నుంచి ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.