40 ఏళ్ల రాజకీయ చరిత్ర.. కుప్పం నుండి 7 సార్లు ఎమ్మెల్యే… తన రాజకీయ జీవితం లో ఎన్నడూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగిన పాపాన పోలేదు. మొదటిసారి ఎమ్మెల్యే గా పోటీ చేసినప్పుడు ఇందిరా గాంధీ హవాలో గెలిచినా, 1983 లో ఎన్టీఆర్ హయాం లో ఓడిపోయినా, 1989 లో నియోజకవర్గం మారి కుప్పం కు వెళ్లినా ఓటమి భయమే లేకుండా కులాసాగా కూర్చుని గెలిచిన బాబు కు తొలిసారి తన సీటే గెలుస్తానన్న నమ్మకం పోయినట్లుంది…
2004 నుండి వరసగా మెజారిటీ తగ్గడం, 2019 లో కేవలం 30 వేల మెజారిటీ రావడం తో, తాను తెచ్చుకునే తమిళనాడు దొంగ ఓట్లతోనే బయటపడ్డానని బాబుకు అర్దం అవ్వడం, జగన్ దెబ్బకు మొదటిసారి కుప్పం లో తన కూసాలు కదిలాయి. స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీతో పాటు, పంచాయితీలలో మేజర్ స్థానాలు వైసీపీ గెలవడం, ఎన్నికల కమీషన్ దొంగవోట్లను ఏరివేయడం తదితర కట్టుదిట్ట చర్యలతో బాబు ఓటమి కళ్లెదుట కనపడింది కాబోలు… అందుకే 30 ఏళ్లుగా ఇళ్లే లేని చోట సొంత ఇల్లు కట్టుకుంటా అని శంకుస్థాపన చేయడం, తాను ఓడిపోతానేమో అనే భయం తో మరో నియోజకవర్గం వెతుక్కోవటం, భార్య ద్వారా నేను పోటీ చేస్తానని చెప్పించి, ప్రజల్లోకి ఎక్కడ నెగెటివిటీ వెళ్తుందేమో, దాని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడే అవకాశం ఉండటంతో తప్పని పరిస్థితుల్లో కుప్పం నుండే పోటీ చేస్తున్న బాబు ఇప్పుడు ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నాడు.
కాలం ఎవరి సరదా అయినా తీర్చేస్తుంది అంటే ఇదేనేమో. రాష్ట్రపతుల్ని చేశా, భారత రత్నలు ఇప్పించా, కేంద్రంలో చక్రం తిప్పా అని చెప్పుకునే బాబుకే సొంత నియోజకవర్గం లో గెలుపు కోసం తిప్పలు పడాల్సిన అవసరం ఏర్పడింది…