నమ్మించి గొంతు కోయడంలో బాబుని మించిన ఘనుడు మరొకరు భారత రాజకీయాల మొత్తంలో ఎక్కడా ఉండకపోవచ్చు.. తాజాగా రఘురామ కృష్ణం రాజు ఉదంతంతో అది మరోసారి నిరూపితం అయింది. నర్సాపురం ఎంపీ టికెట్ బీజేపీ శ్రీనివాస వర్మకు కేటాయించడం తో తెలివిగా టీడీపీ వారు బిజెపి పై నెపం నెడుతున్నారు గానీ, రఘురామకృష్ణం రాజు ఏనాడూ బీజేపీ సభ్యత్వం తీసుకోలేదు, బీజేపీ కి పనీ చేయలేదు. అతను తన శక్తినంతా ఉపయోగించింది టీడీపీ కోసమే. బాబుకు అతనిపై అంత ప్రేమ ఉన్నప్పుడు పొత్తులో భాగంగా టికెట్ల పంపకం జరిగినప్పుడే నర్సాపురం స్థానం బీజేపీ కి ఇచ్చి ఉండకూడదు, లేదా ఆ స్థానం లో రఘురామ కృష్ణం రాజే పోటీ చేస్తాడు అది ఏ పార్టీ అయినా అని కండిషన్ అయినా పెట్టి ఉండాలి. అలాంటివేం జరగకుండా బీజేపీ కి సంబంధం లేని వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వలేదని వాపోవడం బాబు కరివేపాకు సిద్దాంతంలో మొదటి అధ్యాయం. వాడుకున్నన్ని రోజులు వాడుకుని ఇప్పుడు రఘురామ కృష్ణం రాజు ని చేతికి మట్టి అంటుకోకుండా సైడ్ చేసేశాడు..
ఒక్క రఘురామ కృష్ణం రాజేనా? 2019 కి ముందు వైసీపీ నుండి గెలిచి టీడీపీ కి అమ్ముడుబోయిన 23 మందిలో గొట్టిపాటి రవి, భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణలకు తప్ప వేరే ఎవరికీ టికెట్ ఇవ్వలేదు.. గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి అయితే 2024 లో బాబు తమకి ఖచ్చితంగా సీట్ కేటాయిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకోగా కనీసం వాళ్లకి అపాయిట్మెంట్ కూడా ఇవ్వకపోతే బాబు ఇంటి ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఇక 2019 తర్వాత వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే లు గా మారి టీడీపీ పంచన చేరిన వారిలో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి లకూ టికెట్ ఇవ్వలేదు. ఉండవల్లి శ్రీదేవిని చివరి వరకూ ఊరించి ఊరించి ఆఖరి నిముషంలో టికెట్ నిరాకరించడం తో రాజకీయాల్లో ఎవరు ఎలాంటివారో ఇప్పుడు అర్థం అయిందని పోస్ట్ చేసుకున్నారు. ఏం లాభం అంతా అయిపోయాక ఏమర్థం అయినా….
ఇక సొంత పార్టీ వారి విషయానికి వస్తే… మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాకు తెనాలి సీట్ ఇవ్వకుండా పొత్తులో మొదట ఖరారు చేసిన సీట్ జనసేన నుండి నాదెండ్లకు మాత్రమే అవ్వడం విశేషం. పైపెచ్చు ఆలపాటిని పిలిపించుకుని నాదెండ్ల మనోడే, అర్థం చేస్కో అని సముదాయించడం మరో ఎత్తు. ఎట్టి పరిస్తుతుల్లో తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిందేనని ఆలపాటి పట్టుబట్టడంతో గుంటూరు ఎంపీ లేదా, పెనమలూరు లేదా మైలవరం లో అవకాశం ఇస్తా అని చివరికి ఎక్కడా టికెట్ లేకుండా చేయగా ఆలపాటి మనస్తాపానికి గురై రాజకీయాల నుండి తప్పుకోవాలా అనే ఆలోచనలో పడ్డాడు..
ఇకపోతే మరో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మైలవరం టికెట్ కేటాయించకుండా తన రాజకీయ ప్రత్యర్ధి అయిన వైసీపీ నుండి టీడీపీకి వెళ్లిన వసంత కృష్ణప్రసాద్కు కేటాయించి దేవినేని ఉమాకు మొండిచేయి చూపించాడు.. ఇక 2019 లో ఓటమి చెందగానే కొందరు నేతలను బిజెపిలోకి పంపగా వారిలో ఒకరైన వరదాపురం సూరి కి చివరి వరకు ధర్మవరం సీటు నీకే అది టీడీపీ అయినా బిజెపి అయినా అని నచ్చజెప్పి చివరికి అతనికీ టికెట్ లేకుండా పోయింది. రాయలసీమ లో బలమైన పరిటాల కుటుంబం టీడీపీ కి మొదటి నుండీ సేవ చేస్తూ వస్తుంది. కాగా ఇంటికో టికెట్ అనే పేరుతో పరిటాల శ్రీరామ్ కు ఎంత బ్రతిమాలినా టికెట్ నిరాకరించాడు బాబు. అలాగే జేసీ కుటుంబం నుండి కూడా ఒకే టికెట్ ఇచ్చాడు. ఇకపోతే ఉత్తరాంధ్ర లో టీడీపీ కి బలమైన నాయకుడు అయిన కళా వెంకటరావ్ కు ఇంతవరకు టికెట్ ప్రకటించకుండా తను పోటీ చేసే ఎచ్చర్ల సీటు ను బీజేపీ కి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అదే నిజం అయితే పార్టీకి ఇన్నేళ్ళుగా సేవ చేస్తున్న కళాకు టికెట్ లేనట్టే….
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ ఐదేళ్లకు బాబు ఖాతాలో బలైన వారి సంఖ్య గుణాత్మక శ్రేణిలో పెరుగుతూ పోతుంది… మరోసారి కరేపాకు లిస్ట్ లో డజనుకు పైగా టీడీపీ, ఇతర పార్టీ ల నుండి టీడీపీ లోకి వచ్చిన వారూ జాయిన్ అయ్యారు… అయినా ఇప్పటికీ బాబును అంత గుడ్డిగా ఎలా నమ్ముతూ ఉంటారో ఆశ్చర్యమే.. అంతే కదా గొర్రె నమ్మేది కసాయివాణ్ణే గా….