టీడీపీ అధినేత చంద్రబాబు కు మరొక కొత్త చిక్కొచ్చిపడింది. అసలే లోకేష్ కుర్చీ మడతపెట్టి, జగన్ షర్టు మడత పెడుతున్న టైములో… సీఐడీ కొత్త చార్జి షీటుని మడతపెట్టింది. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ కొత్త ఛార్జిషీటు దాఖలు చేసింది. అందులో ముఖ్యంగా… చంద్రబాబు నాయుడుని ఏపీ ఫైబర్నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంది. రెండవ నిందితుడి వేమూరి హరికృష్ణ, మూడవ నిందితుడిగా కోగంటి సాంబశివరావు పేర్లు చేర్చింది.
ఫైబర్నెట్ కై మార్కెట్ సర్వేలు చేయించుకోండానే టెండర్లు పిలవడం, టెరాసాఫ్ట్ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించేలా అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వేరే బిడ్డల్లా ద్వారా డమ్మి టెండర్లు వేసేలా చేయడం వంటివి చంద్రబాబు చేసారని సీఐడీ ప్రధాన ఆరోపణలు చేసింది.
రూపాయలు రెండు వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో, 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు జరిగినట్టు, అవినీతి చేసినట్టు సీఐడీ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా నగదు తరలించి, ఐటీ శాఖ చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టును, బాబు అధ్వర్యంలో ఉన్న విద్యుత్ మౌలిక సదుపాయాల శాఖతో చేపట్టమని బాబే స్వయంగా ఆదేశించి, ఏకపక్షంగా టెరాసాఫ్ట్ను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి, ఇతర కంపెనీలను పక్కన పెట్టేసారు. దీనిపై పవర్ పేస్ అనే కంపెనీ అభ్యంతరాలు తెలిపినా ఖాతరు చేయలేదు.
నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్నెట్ టెండర్ల మదింపు కమిటీ సభ్యుల్లో కూడా నేర చరిత్ర ఉన్నా వేమూరి హరిప్రసాద్ను చేర్చి చంద్రబాబు అన్నిరకాల నిబంధనలను తుంగలో తొక్కారు. కేంద్ర నిధులతో చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టులో చంద్రబాబు లూటీలను సీఐడీ ఆధారాలతో సహా శుక్రవారం ఏసీబీ కోర్టు ముందు దాఖలు చేసింది. మరి ఈ ఫైబర్నెట్ కేసు నుండి బయటపడాలంటే చంద్రబాబు లాయర్లకు ఎంత ఖర్చు పెట్టాలో, ఎన్ని మడతలు పెట్టాలో