తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాదులో తమ నివాసాలు ఏర్పరచుకొని ఎన్నికల వేళ ఆంధ్రకి వచ్చి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు, అలాంటివారిని ప్రజలు దూరం పెడతారని విశ్వసిస్తున్నానని చెప్పారు.
వలస పక్షులకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియా సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాదులో తమ నివాసాలు ఏర్పరచుకొని ఎన్నికల వేళ ఆంధ్రకి వచ్చి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు, అలాంటివారిని ప్రజలు దూరం పెడతారని విశ్వసిస్తున్నానని చెప్పారు.
చంద్రబాబు బూటకపు హామీలను ప్రజలు నమ్మరని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని నారాయణస్వామి స్పష్టం చేశారు. నారాయణ స్వామి మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99 శాతం అమలు చేశారన్నారు. సచివాలయాల ద్వారా 1.35 లక్షల మందికి ఉద్యోగావకాశం కల్పించారని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖలో 54 వేల పోస్టుల భర్తీ, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు.
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్తో కలసి ఐదేళ్లలో మొత్తం 6.48 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. ఎన్నికల్లో గెలవలేమని భావించే చంద్రబాబు జనసేన, బీజేపీతోపాటు రహస్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని హీనంగా తిట్టిన చంద్రబాబు కేసుల భయంతో బీజేపీకి సాష్టాంగ పడ్డారని విమర్శించారు.
అధికారం కోసం కుట్రలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించామని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఏపీకి వలస వచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.