రాజ్యసభలో కేంద్ర ఉపాధి కల్పన మంత్రి చెప్పిన మాట, యస్.బై.ఐ ఇచ్చిన మరొక నివేదిక రెండూ ఇపుడు టీడీపికి భయం పట్టుకునేలా చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రస్తుత ప్రభుత్వం చేసిన కార్యక్రమాల ఫలాలు, ఫలితాలు వెలువడుతున్న కొద్దీ టీడీపీకి కలవరపాటు కలుగుతుంది.
రాజ్యసభలో జరిగిన ప్రసంగం మేరకు.. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ఉద్యోగాలు పదహారు లక్షలకి పెరిగాయి. లెక్కా పత్రం చూపించమంటూ మన ప్రతిపక్షం గొంతు చించుకోవలసిన అవసరం లేకుండా… గత అయిదేళ్ళలో ఆంధ్రాలో జమ అయిన కొత్త పీయఫ్ అకౌంట్లే అందుకు నిదర్శనం. అందులో మరొక మాట మాట్లాడేందుకు, ప్రశ్నించేందుకు లేకపోవడం వల్ల ప్రతిపక్షమైన టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
అంతటితో అవలేదు. యస్.బీ.ఐ ఇచ్చిన నివేదిక ప్రకారం బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు పెరిగాయి. అది కూడా.. ఐదేళ్ళలో వార్షిక సగటు వృద్ధి 9.3 శాతం. ఇందులో మన ఆంధ్ర ప్రజల వాటా కూడా ఉంది. క్రెడిట్ వార్షిక సగటు వృద్ధి కూడా 14.3 శాతం ఉండటం గమనార్హం. ఇవేమీ సొంత మీడియా సంస్థలతో చేయించుకున్న భజన సర్వేలు కూడా కాదు. జగన్ ప్రభుత్వం చేబడుతున్న చర్యల వలన, సుపరిపాలన వలన ప్రజల ఆదాయం పెరిగింది అనేది కళ్ళ ముందు కనబడుతున్నా ఒప్పుకోలేని స్థితిలో పాపం చంద్రబాబు కూరుకుపోయి ఉన్నారు.