ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందని గణంకాలు చెబుతున్నాయి. తాజాగా కేంద్రం జీఎస్టీ వసూళ్ల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే ఏపీ వస్తు, సేవల పన్ను వసూళ్ల వృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. 2023 మార్చిలో రూ.3,532 కోట్లు వసూళ్లయ్యాయి. అదే 24 మార్చిలో 16 వృద్ధితో రూ.4,082 కోట్లకు పెరిగింది.
ఇక తెలంగాణ విషయానికొస్తే 2023 మార్చిలో రూ.4,804 కోట్లు వసూళ్లయ్యాయి. 24 మార్చికి కేవలం 12 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. రూ.5,399 కోట్లు వచ్చాయి. ఇక దేశం వివరాలు చూస్తే 23 మార్చికి రూ.1.60 లక్షల కోట్లు ఉండగా, 24 మార్చి నెలలో రూ.1.78 లక్షల కోట్లతో 11.5 శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా ఏపీ 16 శాతం వృద్ధితో దూసుకెళ్తోంది.
ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ప్రతినెలా జీఎస్టీ వసూళ్లు వేగంగా పెరుగుతున్నాయి.