ఏపీలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ ప్రచారాలను ప్రారంభించిన వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఈరోజు నుండి జన సేన కూడా తమ ఎన్నికల ప్రచారంను ప్రారంభిస్తున్నారు. అటు చూస్తే ఏపీ కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు, ఇవాళ్టి నుంచి విజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ శ్రేణులు సన్నద్దం చేస్తూ ఎన్నికల హామీలుగా తొమ్మిది గ్యారంటీలను ప్రకటించి వాటి పోస్టర్ లను విడుదల చేసింది ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన షర్మిల
అందులో మొదటిది ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు లక్ష రూపాయల సాయం
రెండవది రైతు పెట్టుబడిపై 50 శాతం లాభంతో మద్దతు ధర
మూడవది ప్రత్యేక హోదా పదేళ్లు గ్యారంటీ
నాలుగవది ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం
ఐదవది కేజీ టు పీజీ ఉచిత విద్య
ఆరవది వృద్ధులకు, వితంతువులకు 4వేలు ఫించన్ వికలాంగులకు 6వేల ఫించన్
ఏడవది ఉపాధి హామీ కూలీకి రోజుకు కనీస వేతనం గా 400 రూపాయలు
ఎనిమిదవది మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా 30 లక్షల ఉద్యోగాలు,
తొమ్మిదవది రాష్ట్రం ద్వారా 2.25 లక్షల ఉద్యోగాలు
అలాగే ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందిట ఏపీ కాంగ్రెస్. ఈ ప్రచార కార్యక్రమాల్లో షర్మిల పాల్గొంటారని ఏపీ కాంగ్రెస్ తెలిపింది. ఇక అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది అని వాటిని పార్టీ హై కమాండ్ తొందర్లోనే ప్రకటిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.