అమరావతి రాజధానిలో జరిగిన భారీ భూదోపిడి పై ఏపీ సిఐడి కొరడా ఝలిపించింది. చిన్న అవకాశం వస్తే చాలు ఎక్కడెక్కడ భూములు దోచుకుందామా అని కాచుకొని ఉంటాడు చంద్రబాబు. అమరావతి రాజధాని విషయంకొస్తే తనకు కావలసిన వారికి ముందుగానే లీకులు ఇచ్చి భూములు కొనిపిస్తాడు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతాడు చివరికి అసైన్డ్ భూములను కూడా కాజేస్తాడు. తనని ఎవరు పట్టుకోలేరని చంద్రబాబు ధీమా. స్కిల్ స్కామ్ కేసులో మొదలై, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంతో కొనసాగుతూ ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్ భూముల వద్దకు వచ్చాడు. 4400 కోట్ల రూపాయల విలువచేసే అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సిఐడి నిర్ధారించింది. దాదాపు 11 వందల ఎకరాలు అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సిఐడి పేర్కొంది. అసైన్డ్ భూముల స్టాంలో ప్రధాన నిందితుడుగా చంద్రబాబు, మాజీమంత్రి నారాయణను రెండో నిందితుడుగా పొందుపరిచారు.
క్యాపిటల్ సిటీ ప్లాన్ తో చంద్రబాబు భారీ కుంభకోణానికి తెర లేపినట్లు సిఐడి తెలిపింది. చంద్రబాబు ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొట్టేశారని సిఐడి నిర్ధారించింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు స్కాం చేసినట్లు సిఐడి పేర్కొంది. చంద్రబాబు నారాయణతో పాటు మాజీ తాసిల్దార్ సుధీర్ బాబు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండి అంజలి కుమార్ ముద్దాయిలుగా చార్జిషీట్ దాఖలు చేసింది.