ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ వాలంటీర్ వ్యవస్థ చుట్టూనే తిరుగుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ పైన మొదటి నుంచి టీడీపీ అవాకులు చవాకులు పేలుతూనే ఉంది. టీడీపీ చేసిన రాజకీయం కారణంగా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు దూరమైంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో పాటు టీడీపీ హైకోర్టుకు వెళ్లడంతో ఇప్పటివరకు దాదాపు 80000 మంది వాలంటీర్లు తమకు జరిగిన అవమానం కారణంగా రాజీనామా చేశారు. కాగా ఇప్పుడు మరోసారి వాలంటీర్ల విషయం హైకోర్టుకు చేరింది.
ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వీరంతా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తారని, ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు పక్కదారి పడతాయని తన పిటిషన్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును బోడే రామచంద్ర యాదవ్ కోరారు. కాగా ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపట్టనున్నట్టు హైకోర్టు వెల్లడించింది.
కొద్దిరోజుల క్రితం చంద్రబాబు తనకు నమ్మకస్తుడైన నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పించొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయలేదు. హైకోర్టులో అలా పిటిషన్ వేయించడం, ఎన్నికల కమీషన్ ముందుకు వెళ్లి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇప్పించండి అంటూ ఎన్నికల కమిషన్ ను కోరడం టిడిపికే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా వాలంటీర్ల వ్యవస్థను అవమానపరుస్తూ వచ్చిన చంద్రబాబు మాటలకు జవాబుగా రాష్ట్రంలో దాదాపు లక్షమంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ రాజీనామాలు ఆమోదించొద్దు అంటూ హైకోర్టులో కేసు ఆ రాజీనామాలు ఆమోదించొద్దు అంటూ బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఏ విధమైన తీర్పిస్తుందో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది..
2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేసాడు. గతంలో పెన్షన్ దారులు నెల వస్తే చాలు పెన్షన్ పొందాలంటే చాలా అవస్థలు పడేవారు కానీ ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత పెన్షన్ దారులు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరోనా సమయంలో వాలంటీర్ల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిచింది.