ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థను తెలంగాణాలో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 80 వేల మందిని రిక్రూట్ చేస్తూ టీఎస్ సర్కార్ ఇందిరమ్మ కమిటీలుగా నామకరణం చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు అవినీతి, లంచాలు లాంటి బాధలు ధరిచేరకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ పారదర్శకంగా అమలువుతున్నాయంటే దానికి వాలంటీర్ వ్యవస్థ కూడా కారణం. ప్రభుత్వ సుపరిపాలన రాష్ట్రంలోని చిట్టచివరి ప్రాంతంలోని ప్రజలకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించాలన్నదే వాలంటీర్ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం. ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరి నుండి చూసిన వైఎస్ జగన్ అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకురావాలని కులం, మతం, వర్గం, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్న ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు.గ్రామ వాలంటరీ వ్యవస్థపై పలు ప్రపంచ దేశాలు సైతం ఆసక్తి చూపిస్తున్నాయి. మన దేశం లోనే అనేక రాష్ట్రాల నుండి ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ కు వఛ్చి వాలంటీర్ వ్యవస్థ పై అధ్యనం చేశారు కానీ చంద్రబాబు నాయుడుకు.. ఆయన దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఆ వ్యవస్థ గొప్పతనం అర్ధం కాకపోగా.. గొను సంచులు మోసే ఉద్యోగం అంటూ కించపరిచారు.
కానీ ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు అనుచరుడు రేవంత్ రెడ్డి తెలంగాణాలో ముఖ్యమంత్రి హోదా లో వైఎస్ జగన్ ఆలోచనను అనుసరిస్తూ తెలంగాణ లో వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు.. ఇప్పుడేమంటారో మరి చంద్రబాబు..