వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు మద్దతు ఇచ్చినా వారిపై తప్పుడు కథనాలు ప్రసారం చేసి సదరు వ్యక్తుల వ్యక్తిత్వహనానికి పాల్పడటం ఎల్లో మీడియాకి పరిపాటిగా మారిపోయింది. మీడియా చేతిలో ఉంది అనే ధీమాతో తాము ఏమీ చేసినా చెల్లిపోతుందనే ధైర్యంతో సామాన్యులని సైతం వేధింపులకి గురి చేస్తుంది సదరు మీడియా. తాజాగ ఎల్లో మీడియా యాంకర్ శ్యామలను టార్గెట్ చేసింది. గడిచిన ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడమే ఈ ఎల్లో మీడియా ప్రతినిధులకి ఆమె చేసిన తప్పుగా మారింది.
బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో కొందరు టాలీవుడ్ కి చెందిన వ్యక్తులు ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ధారణ లేకుండానే సదరు ఎల్లో మీడియా సంస్థలు ఆ పార్టీలో యాంకర్ శ్యామల కూడా ఉందనే విధంగా ఆమె ఫోటోలు ప్రచారం చేస్తూ కథనాలను వండివార్చింది. అయితే ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారనికి గట్టిగానే జవాబిచ్చారు శ్యామల. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని శ్యామల తెలిపారు. కావాలనే ఎల్లో మీడియా తనపై పనికట్టుకుని ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తున్నారని, ఇప్పటికే వారిపై పరువునష్టం దావా వేసినట్లు శ్యామల వెల్లడించారు.