సార్వత్రిక ఎన్నికలకు సంభందించి తెలుగుదేశం పార్టీ తుది జాబితాని విడుదల చేసింది. ఈ తుది జాబితాలో మొత్తం నాలుగు లోక్ సభ, 9 శాసన సభ అభ్యర్ధులని ప్రకటించింది. ఈ తుది జాబితాలో అభ్యర్ధుల్లో అందరికన్నా ఎక్కువగా ప్రజలని ఆకర్షించిన స్థానం అనంతపురం పార్లమెంట్ సీటు. ఈ సీటుని చంద్రబాబు గతంలో వాల్మీకి సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న అంబిక లక్ష్మీనారాయణకి కేటాయించారు.
వాల్మీకి సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు అంబిక లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుపై చేసిన ఆరోపణలను ఇంకా ఎవరు మర్చిపోయి ఉండరు. 2014 ఎన్నికల సమయంలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పిన మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు కుంటిసాకులు వీడి నిలుపుకోవాలని చేసిన డిమాండ్లు. చంద్రబాబు పాలనలో నిరుద్యోగ సమస్య అధికమై యువత అత్మహత్యలు చేసుకుంటున్నారని, ఏ మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి బాసటగా నిలువలేదన్నారు అంబిక .
ఇది ఇలా ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారు మాత్రం తాను పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి సర్కార్ ఏర్పాటైన తర్వాత ఈ అంశానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా కమిషన్ వేసి సాధ్యాసాధ్యాలపై నివేదికను సీఎం వైఎస్ జగన్ తెప్పించుకుని, వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేరుస్తూ 2023 మార్చ్ 24న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఇచ్చిన మాటకి కట్టుబడ్డారు. చంద్రబాబు 5ఏళ్ళ పాలన కన్నా జగన్ పాలనలో సంక్షేమంలోనూ , ఉద్యోగాల కల్పనలోనూ అధికంగా మేలు చేశారు. అలాగే వాల్మీకులకి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 105 పదవులు ఇచ్చి వారికి రాజకీయంగా పెద్దపీట వేశారు.
చంద్రబాబు చేసిన మోసాన్ని పదే పదే ప్రశ్నించిన అంబికా లక్ష్మీ నారాయణ చివరికి చంద్రబాబు విసిరిన ఎంపీ స్థానానికి తలొగ్గి వాల్మీకులకి ఎంతో మేలు చేసిన జగన్ కి వ్యతిరేకంగా నిలబడటాన్ని వాల్మీకులు ఎప్పటీకి సమ్మతించరని. అవసరాలకి పదవులకి లొంగే నాయకుల కన్నా తమ అవసరాలు తీర్చే నాయకత్వం వైపే తాము ఉంటామని రాయల సీమ వ్యాప్తంగా వాల్మీకులు చెబుతున్నమాట .