2014లో బీజేపీ,జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందని కానీ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసారని మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్ ను ఓడించలేరని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
2014 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసినా 2019 ఎన్నికల్లో విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారని అంబటి గుర్తు చేశారు. ప్రధాని మోదీని చంద్రబాబు ఘోరంగా విమర్శించారని ఇప్పుడేమో పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజాగళం ఏం సందేశం ఇచ్చింది? ప్రజాగళం సభలో మైక్ మూగబోయింది. మైక్ కూడా సరిచేసుకోని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని అంబటి ఎద్దేవా చేశారు.
ఏపీలో సీఎం జగన్ అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అందుకే సీఎం జగన్ సభలకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారని కానీ అదే సమయంలో ఆ మూడు పార్టీలు పెట్టిన సభలకు ప్రజల్లో పెద్ద స్పందన ఉండటం లేదని తెలిపారు. పవన్ తో జట్టు కట్టినా సీఎం జగన్ ని ఓడించలేమని గుర్తించిన చంద్రబాబు ప్రధాని మోదీతో పొత్తు పెట్టుకున్నారని అంబటి రాంబాబు వెల్లడించారు.