టీడీపీ పెట్టిన మొదట్లో మాది బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి బీసీ లకు ఎక్కువ సీట్లు ఇచ్చేవారు. తర్వాత టీడీపీ బాబు చేతిలో పడ్డాక ఆ బీసీ ఓటు బ్యాంక్ అలాగే ఉండగా సీట్లు మాత్రం కోత పడుతూనే ఉన్నాయి. తన BC (బాబు క్యాస్ట్)ల కోసం BC లకు అన్యాయం చేసి చేసి అలసిపోయిన బాబు ఇప్పుడు మిగతా కులాల మీద సూటి పెట్టాడు.
బీజేపీ-జనసేన తో పొత్తులో భాగంగా బీజేపీ కి 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాలు ఇవ్వగా, జనసేనకు 21 ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు( గ్యారంటీ లేదు చెప్పలేం) అని ప్రస్తుతానికి ఉన్న పంపకాల లెక్క.. కానీ జనసేన అభ్యర్థులు సగానికిపైగా టీడీపీ లో టికెట్ దక్కక జనసేన నుండి ముందే టికెట్ కన్ఫామ్ చేసుకుని బాబు పంపితే వెళ్లిన వారే ఉండగా, బీజేపీ నుండి పోటీ చేసేవారిని కూడా బాబే నిర్ణయిస్తున్నాడు. ఉదాహరణకు పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా జనసేన లో ఉన్నది పట్టుమని పదిమంది నాయకులు, అందులో విజయవాడ నుండి పోతిన మహేష్, తిరుపతి నుండి కిరణ్ అనే మరో చోటా నాయకుడు. ఇచ్చిన 21 లో వీళ్ళిద్దరికీ ఈజీగా సీట్లు కేటాయించవచ్చు కానీ వారిని కాదని ఆ సీట్లను బీజేపి కి, టీడీపీ కి త్యాగం చేశాడు పవన్.. పవన్ చేయలేదు బాబే చేయించాడు అనేది జగమెరిగిన సత్యం.
175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో 90% సీట్లు బాబు నిర్ణయం ప్రకారమే సర్దుబాటు అవుతున్నాయి. కాగా రాజమండ్రి నుండి ఆ ప్రాంతం తో ఏ సంబంధం లేని పురందేశ్వరి ఎంపీ గా పోటీ చేస్తుండగా, కడప నుండి వచ్చి సీఎం రమేష్ అనకాపల్లి నుండి పోటీ చేస్తున్నాడు. రాజమండ్రి పార్లమెంట్ కు చెందిన సోము వీర్రాజు కు అసలు టిక్కెట్టే లేదు. పార్టీకి ఎన్నో ఏళ్ల నుండి సేవ చేస్తున్న సోము లాంటి వాళ్లకి టికెట్ లేకపోవడం ఎంతో అవమానం. ఇక వైజాగ్ నుండి ఎంపీ గా పోటీ చేద్దాం అని 5 ఏళ్ల క్రితమే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డ జీవీఎల్ ను కాదని బాబు బంధువు, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కోసం ఆ సీట్ త్యాగం చేసేశారు బాబు చుట్టం, బాలకృష్ణ అక్క పురందేశ్వరి.
బీజేపీ పోటీ చేసే మొత్తం 16 స్థానాల్లో ఒక్కటి అంటే ఒక్క సీట్ లో కూడా కాపు సామాజిక వర్గానికి చోటే లేదు. ఇక బీజేపీ కి ఎప్పటినుండో బలంగా ఉన్న బ్రాహ్మణ, వైశ్యులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం శోచనీయం. జీవీఎల్ లాంటి బ్రాహ్మణ సామాజిక వర్గ నేతకే టికెట్ లేదంటే దానికి కారణం బాబు మాత్రమే. బీజేపీ లో తన వర్గీయులకే టికెట్ వచ్చేలా, ఫక్తు బీజేపీ వాదులకు టికెట్ రాకుండా పురంధేశ్వరి ద్వారా బాబు చేసిన మ్యానేజ్మెంట్ పేరే చాణుక్యం.
ఇక కాపుల విషయానికి వస్తే టీడీపీ పోటీ చేయబోతున్న 144 సీట్లలో కాపులకు కేటాయించిన సీట్లు కేవలం 14 మాత్రమే. అదే వైసీపీ నుండి 31 మండి కాపులు టికెట్ దక్కించుకున్నారు.. ఈ విషయం పైనే కాపులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కల్యాణ్ బాబు కోసం అంతలా తాపత్రయ పడుతుంటే బాబు కనీసం 20 సీట్లు కూడా కాపులకు కేటాయించనప్పుడు టీడీపీ ని భుజాల మీద మోయాల్సిన ఖర్మ మాకేంటి అంటూ 31 సీట్లు కేటాయించిన వైసీపీ వైపు వారి మనసు మళ్లింది అని రాజకీయ వర్గాల విశ్లేషణ.
ఇక చంద్రబాబు కాపులకు పోటు, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు పోటు, బీసీ లకు పోటు, అన్ని రకాల పోట్లు పొడిచింది తన కుల స్వార్థం కోసమే. బాబుకు తన కుల ప్రయోజనాలే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు కాదు అనేది మరోసారి నిరూపితం అయింది..