హామీలు ఉండేవే మళ్లీ మళ్లీ ఇవ్వడానికి అని బలంగా నమ్మే చంద్రబాబు, తాను నెరవేర్చని అదే హామీని మళ్లీ మళ్లీ ఇవ్వడం షరా మామూలే.. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న బాబు నేడు రాప్తాడు లో ప్రచారం సందర్భంగా గోదావరి నీళ్లు రాయలసీమకి తీసుకొచ్చి మీ గొంతు తడిపే భాద్యత నేను తీసుకుంటా అని మళ్లీ మాటిస్తున్నా తమ్ముళ్ళు అనేశాడు.. మళ్లీ మాట ఇస్తున్న అనడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం.
ఎందుకంటే బాబు గతంలో పలు మార్లు ఇదే హామీ ఇచ్చాడు. రాజయాలసీమకు సుజలాం సఫలాం అంటూ శంకుస్థాపన చేసిన సుజల స్రవంతి పథకం మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఇంతవరకు దానికోసం తెట్టెడు మట్టి ఎత్తిన పాపాన పోలేదు. పక్కనే కృష్ణ నది నుండి నీళ్లు ఇవ్వలేడు గానీ ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లిస్తాడట. 7 సార్లు ఎమ్మెల్యే, మూడు సార్లు ముఖ్యమంత్రి గా ఉండి కూడా కుప్పం కు తాగునీరు ఇవ్వలేకపోయాడు బాబు. జగన్ కుప్పం వస్తే ఖాళీ బిందెలతో నిరసన తెలపండి తమ్ముళ్లు అని సిగ్గు లేకుండా మాట అనేసి, కుప్పం ఎమ్మెల్యే తానే అనే విషయాన్ని మరిచాడు. జగన్ మాత్రం శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి కుప్పానికి నీరు అందించి బీడువారిన కుప్పం నేలను తడిపాడు.. సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చే చొరవ చూపని బాబు రాయలసీమ మొత్తాన్ని గోదావరి నీళ్లతో తడుపుతాడట. నమ్మేవారు ఉండాలి గానీ తెలుగు వాళ్లు వెళితే తిండికి ఇబ్బంది పడకుండా చంద్రమండలం మీద అన్నా క్యాంటీన్ పెడతా అంటాడు… అందుకే అనేది చెప్పేవాడు చంద్రబాబు అయితే రాసేవాడు రామోజీ అని..