రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నికల కమిషన్ సిఈవో మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది.
లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది..ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతోంది… అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జారీ చేసిన మార్గ దర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే…
1.ప్రభుత్వాఫీసుల్లో ప్రధాని, సీఎం, మంత్రుల ఫోటోలను తొలగించాలి.
2.కోడ్ అమల్లోకొచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వాఫీసుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు తొలగించాలి.
3.పొలిటికల్ హోర్డింగులు, పోస్టర్లు, గోడరాతలు తొలగించాలని అలాగే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రోడ్లు, బస్సులు, విద్యుత్ స్థంభాల పైన ప్రకటనలు తొలగించాలి.
4.ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు నిలిపివేయాలి.
5.అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలను తొలగించాలి.
6.మంత్రులకు ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపేయాలి.
7.ఎన్నికల ప్రక్రియలో ఉన్న అధికారులు, అధికార యంత్రాంగం బదిలీలపై పూర్తి నిషేధం అమలు .
8.మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు పైలట్ కార్లు, సైరన్ వినియోగించకూడదు.
9.ప్రభుత్వ గెస్ట్ హౌసుల నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధుల్ని ఖాళీ చేయించాలి.
ఇవి కాక అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితులు, మీడియా నిభందనలు, లాంటి మరికొన్ని అంశాల పై ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి స్పష్టత రానుంది.