తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి భజన చేయడంలో వేమూరి రాధాకృష్ణ ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటారు. నిరాశ పరచడు. ఈ ప్రపంచంలో బాబును మించిన లీడర్ లేడు. రాడు.. రాబోడు.. ఆంధ్రజ్యోతి రాతల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తుంది. జరిగేది ఒకటైతే ఇంకోటి ప్రచురిస్తుంది. దీనిని చదివి వారికి అవునా.. నిజమా.. అనిపిస్తుంది. గుడ్డి నమ్మే రోజుల్లేవని మాత్రం గ్రహించదు. ఒకవేళ బాబు ఏదో సందర్భంలో అమెరికా అధ్యక్షుడిని కలిశారే అనుకుందాం.. అందుకు జ్యోతి వాళ్ల ఆహ్వానం మేరకే నారా వారు వెళ్లారని రాసి మురిసిపోతుంది.
గత నెలలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసి ఎన్డీఏలో చేరుతానని బతిమిలాడుకున్న విషయం తెలిసిందే. కానీ జ్యోతిలో మాత్రం వాళ్లే బాబును పిలిచి ప్రతిపాదన పెట్టారని రాసుకొచ్చింది. కమలం పెద్దలే పిలిస్తే ఇంత వరకు ఎందుకు తేల్చలేదంటే సమాధానం తెలుగు తమ్ముళ్ల నుంచి సమాధానం ఉండదు. బీజేపీ ఏ విషయం తేల్చకపోవడంతో ఇక లాభం లేదనుకుని బాబు, పవన్ గురువారం హస్తినకు వెళ్లి షాను కలిశారు.
ఇంకేముందు ఆంధ్రజ్యోతి రెచ్చిపోయింది. అక్కడోళ్లకు తెలుగు చదవడం రాదు కదా అని అడ్డదిడ్డంగా బాబుకు భజన చేసింది. అపాయింట్మెంట్ దొరక్క టీడీపీ అధినేత ఇంత కాలం కలవలేకపోతే.. అమిత్షా ఆహ్వానం మేరకే ఢిల్లీకి వెళ్లారని రాసింది. బాబు, పవన్ వెళ్లి భేటీ అయితే.. వాళ్లిదరితో షా, నడ్డా భేటీ అయ్యారని చెప్పుకొచ్చింది. అక్షరాల్లో తేడాతో చాలా అర్థం మారింది కదా.. అప్పుడే అయిపోలేదు. మేము 370 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వాలని కమలం పెద్దలు కోరారట. అసలు మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను మహాప్రభో.. నన్ను ఎన్డీఏలోకి తీసుకోండని కదా బాబు అడిగింది. అందులోనూ దేశాన్ని శాసిస్తున్న ఆ పార్టీ పెద్దలు ఎక్కువ ఎంపీ సీట్లు అడిగారంటే ఏ మాత్రం నమ్మబుద్ధిగా లేదు కదా.. కానీ జ్యోతి అదేమీ పట్టించుకోలేదు.
ఇంకా నాలుగు ఎంపీ, ఆరు అసెంబ్లీలో మీరు పక్కాగా గెలుస్తారు. అంతకు పైన అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందని బాబు మనసులో మాట బయటపెట్టారట. తాము ఏమి రాసినా జనం నమ్మేస్తారని ఇంకా ఎల్లో మీడియా అనుకుంటోంది కాబోలు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఎన్డీఏలో చేరడం బాబుకే అవసరం. చేర్పించడం పవన్కు అత్యవసరం. బీజేపీ పెద్దల దృష్టిలో దేశంలో ఉన్న సవాలక్ష పార్టీల్లో టీడీపీ ఒకటి అంతే.. నాలుగైదు ఎంపీ సీట్ల కోసం కక్కుర్తి పడే స్థాయిలో వాళ్లు లేరు. జ్యోతి ఇలా రాసుకుంటూ పోతే జనం ఛీదరించుకుంటారు తప్ప.. అబ్బా బాబు పెద్ద తోపు అనుకోరు.