రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వచ్చిన తొలి రోజు నుండే టీడీపీ తో బీజేపీ పొత్తు కోసం విశ్వప్రయత్నాలు చేస్తూ, అధిష్టానం ఖరారు చేయక ముందే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తఫున కలిసి ఎన్నికలకు వెళ్తాం అని ప్రకటించడం మొదలు పురంధేశ్వరి బీజేపీ నాయకురాలిగా కాక టిడిపి కి ఆంతరంగిక మిత్రురాలి గా వ్యవహరిస్తున్నారు. టీడీపీ బీజేపీ పొత్తు కుదిరితే టీడీపీ ఓట్లతో తను ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి పదవి పొందాలనే స్వార్థం అయ్యుండవచ్చు కానీ…
తాజాగా పొత్తులో భాగంగా వైజాగ్ పార్లమెంట్ సీట్ ను బీజేపీ కి కేటాయించడం, తనకి రాజమండ్రి నుండి అవకాశం రావడం అన్నీ బీజేపీ కి అనుకూలంగానే జరిగాయి. కానీ ఇంకా టీడీపీ కి లబ్ధి చేకూర్చాలనే ఆవిడ తపన ఆగినట్లుగా లేదు. వైజాగ్ స్థానాన్ని అధిష్టానం జీవీఎల్ కు కేటాయించింది, అందుకు కారణమూ లేకపోలేదు ముందు నుండి జీవీఎల్ వైజాగ్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయదలచి అక్కడే తిష్ట వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. క్యాడర్ ను కూడా బిల్డ్ చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం లో బీజేపీ కి కాస్త ఓటు బ్యాంక్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో పొత్తు లేకపోయినా ఒంటరిగా అయినా వైజాగ్ నుండే తను పోటీ చేయాలని నిర్ణయించుకుని క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్న పురంధేశ్వరి మాత్రం అవేమి లెక్కలోకి తీసుకోకుండా ఆ స్థానాన్ని ముందుగా బాబు మనిషి, బాబే బీజేపీ లోకి పంపితే వెళ్లిన సీఎం రమేష్ కు ఆ సీటు కేటాయించాలని నిర్ణయించుకుంది, అనూహ్యంగా బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఎదురు తిరగడం, తనకు సీటు దక్కపోతే తానేంటో చూపిస్తా అని బెదిరింపులకు దిగడం తో బాబు కు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందాన తయారైంది పరిస్థితి. ఇప్పుడు బాబు సిఫారసుతో వైజాగ్ సీట్ ను భరత్ కు కేటాయించాలని, సీఎం రమేష్ కు అనకాపల్లి సీట్ ఇవ్వాలని భావిస్తూ లాబీయింగ్ మొదలు పెట్టింది. ఈ వ్యవహారాన్నంతా వివరిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాకు లేఖ ద్వారా వివరించినట్లు సమాచారం.
ఫక్తు ఆరెస్సెస్ మనిషి, బీజేపీ భావజాలాన్ని నరనరాన ఇమిడ్చుకున్న జీవీఎల్ లాంటి వారికి కూడా టికెట్ రాకుండా అడ్డుకుంటున్న వ్యక్తి పురంధేశ్వరి, ఆవిడకి బీజేపీ సిద్ధాంతం పై గానీ పార్టీ నిర్మాణం పై గానీ ఆవగింజంత అవగాహన కూడా లేదు. కేవలం బాబు కోసం పని చేయడం, ఎక్కడ జీవీఎల్ గెలిస్తే తనకు కేంద్ర మంత్రి పదవి దక్కకుండా జీవీఎల్ కు దక్కుతుందో అన్న భయం తో మరో సారి బిజెపి రాష్ట్రం లో ఎదిగే అవకాశాన్ని నిర్వీర్యం చేస్తుంది. సొంత పార్టీ కే వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకులు ప్రజలకు ఏం మంచి చేస్తారని వారిని నమ్మాలి..