సీఎం వైఎస్ జగన్ 5 సంవత్సరాల క్రితం ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక ప్రజాతీర్పు పై గురువారం ట్వీట్ చేసారు “దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.”
ఈ ట్వీట్ తో వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సహం కనిపిస్తుంది, తమ నాయకుడి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నట్టు కనిపించడంతో ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, తిరిగి మన నాయకుడు సీఎం అవుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జగన్ కాన్ఫిడెన్స్ కి కారణాలు లేకపోలేదు, అధికారం చేపట్టినప్పటి నుండి మేనిఫెస్టోలో చెప్పినవి చేపినట్టుగా సంక్షేమ పథకాలు అమలుచేస్తూ వచ్చారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు.
గత ఐదేళ్లుగా సంస్కరణలు, వికేంద్రీకరణ, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సీఎం జగన్ సుపరిపాలన అందించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా 2.70 లక్షల కోట్లు జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో 1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు.
దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో 4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడాలేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ఇంటి వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.
ఇవన్నీ చేసారు కాబట్టే ప్రజలు తమకే పట్టం కట్టబోతున్నారని తిరిగి మరలా అధికారంలోకి వచ్చి ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు వేస్తుందని జగన్ తన గెలుపు పై ధీమాగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషించుకుంటున్నారు.