తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలపై, ఇసుక దోపీడీలపై వరుస కథనాలు రాస్తూ వస్తున్న తెలంగాణం పత్రిక-న్యూస్ లైన్ తెలుగు ఛానెల్ కి చెందిన జర్నలిస్ట్ శంకర్ పై నిన్న రాత్రి పాశవికంగా దాడి జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది రౌడీ మూకలు ఒక్కసారిగా శంకర్ ను చుట్టుముట్టి దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన అతని ఆఫీసు సిబ్బందిపైనా రౌడీ ముకలు దాడి చేశారు. దాడి ఘటనపై వీడియో తీస్తున్న శివ అనే ఉద్యోగి ఫోన్ను దుండగులు పగలగొట్టారు. చుట్టుపక్కల జనం రావడంతో అక్కడి నుంచి వెంటనే పరారయ్యారు.
జర్నలిస్ట్ శంకర్ ఒక్క తెలంగాణ సర్కార్ వైఫల్యాలనే కాకుండా ఇటు ఆంద్రప్రదేశ్ లో కూడా రేవంత్ రెడ్డి బాస్ గా చెప్పుకునే తెలుగుదేశం అధినేత చంద్రబాబు పనితీరుని కూడా ఈ మధ్య కాలంలో తీవ్రంగానే విమర్సిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామిలను నమ్మడానికి ఆయన గతంలో ఏం హామీని నిలబెట్టుకున్నారో సమాధానాలు చెప్పాలి అని తన గళాన్ని వినిపించాడు. చంద్రబాబు మోసాలని ప్రజలు నమ్మితే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎలా అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో రేపటి రోజున ఆంద్రా సోదరులు కూడా ఇదే విధమైన ఇబ్బందులు పడతారని ప్రజలని జాగృతం చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో తన పై జరిగిన దాడిలో తెలంగాణ కాంగ్రెస్ గూండాలే కాకుండా ఇటు ఆంద్రాకి చెందిన ఎల్లో మూకలు కూడా ఉన్నారా అనే అనుమానాలు ఇప్పుడు బలంగా వినపడుతున్నాయి. చంద్రబాబు ప్రశ్నించిన వారిపై ఇలా రౌడి మూకలతో దాడులు చేయించడం కొత్తేం కాదు. గతంలో కూడా తెలంగాణ వాదాన్ని తొలుత బలంగా వినిపించిన బెల్లి లలిత లాంటి వారిని కూడా కిరాయి మూకలను పెట్టి హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి, ఇప్పుడు కూడా తనకి అధికారం రాకపోతే ఇక ఎప్పటికి రాదనే ఆలోచనతో తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే, ప్రసారం చేసేవారిలో భయం కల్పించడానికే తెలంగాణలో కాంగ్రెస్ గూండాల సహాయంతో ఎల్లో మూకలు ఈ దాడిలో పాల్గొని ఉండచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .
ఏది ఏమైనా ఇలాంటి దాడులు చేసే వారిని ప్రభుత్వాలనుండి ఎంత వత్తిడి ఉన్నా లెక్కచేయకుండా పోలీసులు వెంటనే అరెస్టు చేసి. ప్రశ్నించే గొంతులపై దాడులు చేసే సంస్కృతిని ఆదిలోనే తుంచేయాలని ఇరు తెలుగు రాష్ట్రాల మీడియా వర్గాల నుండి వస్తున్న డిమాండ్.